News January 29, 2025
కొడంగల్: వాహనాల పన్ను బకాయి రూ.2కోట్లు.!

వాహనదారులు తమ వాహనాన్ని మొబైల్ నంబర్తో లింక్ చేసుకోవాలని వికారాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. లింక్ చేయడంతో లైసెన్సు రెన్యూవల్, ఫిట్నెస్ రెన్యూవల్, టాక్స్ పేమెంట్స్ తదితర సమాచారం మొబైల్ ఫోన్ అలర్ట్కు పొందవచ్చు అన్నారు. జిల్లాలో దాదాపు 5వేలకు పైగా వాహనాల పన్ను బకాయిలు దాదాపు రూ. 2కోట్లు ఉన్నాయని తెలిపారు.
Similar News
News November 15, 2025
HYD: అమెరికాలో బాత్రూంలు కడిగే వారికి ఏం తెలుసు?: చిన్నశ్రీశైలం యాదవ్

పహిల్వాన్లకు, రౌడీలకు తేడా తెలియకుండా BRS వాళ్లు సన్నాసుల్లా మాట్లాడుతున్నారని నవీన్ యాదవ్ తండ్రి చిన్నశ్రీశైలం యాదవ్ అన్నారు. శుక్రవారం యూసుఫ్గూడలోని కాంగ్రెస్ ఆఫీస్లో ఆయన మాట్లాడారు. HYDలోని వ్యాయామశాలల్లో ఉండే వారిని పహిల్వాన్లు అంటారని, ప్రజలను ఇబ్బంది పెట్టేవారిని రౌడీలు అంటారన్నారు. అమెరికాలో బాత్రూంలు కడిగేవారికి HYD సంస్కృతి గురించి ఏం తెలుసు అని KTRపై పరోక్షంగా మండిపడ్డారు.
News November 15, 2025
భీమడోలు: ఏడేళ్లుగా పరారీ.. నిందితుడి అరెస్ట్

భీమడోలు మండలం పూళ్లలో 2007లో జరిగిన హత్య కేసులో గుడివాడకు చెందిన నిందితుడు స్టీవెన్ను పోలీసులు శుక్రవారం విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. స్టీవెన్ ఏడేళ్ల నుంచి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన CI విల్సన్, SI మదీనా బాషా, హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాసరావు, సురేష్ను SP ప్రతాప్ శివ కిషోర్ ప్రశంసించారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచామన్నారు.
News November 15, 2025
నేడు పాడేరులోని విద్యాసంస్థలకు సెలవు

బిర్సాముండ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈనెల 16న ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ పాడేరులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా శనివారం పాడేరులోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. పాడేరులోని డిగ్రీ, జూనియర్ కళాశాలలు, సెయింట్ ఆన్స్ స్కూల్, నక్కలపుట్టు యూపీ పాఠశాల, లోచలిపుట్టు ఆశ్రమ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.


