News March 24, 2025

కొడంగల్: విషాదం.. యువకుడి మృతి!

image

యువకుడు ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన కొడంగల్ పరిధి మద్దూరులో జరిగింది. ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాలు.. మండలంలోని గోకుల్ నగర్‌ వాసి సాయిలు(21) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయంపై తండ్రి మందలించాడని ఈనెల 17న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడని మద్దూర్ ఎస్ఐ తెలిపారు.

Similar News

News December 22, 2025

బూతుల్లేకుండా కథలు చెప్పలేరా?

image

ఇప్పుడొచ్చే సినిమాల్లో రక్తపాతం, రొమాన్సే కాదు బూతులు కూడా కామనైపోయాయి. చిన్నపిల్లలూ చిత్రాలు చూస్తారు, వింటారనే కామన్‌సెన్సును వదిలేసి తల్లులను అవమానించేలా ల** లాంటి పదాలను నిస్సిగ్గుగా వాడేస్తున్నారు. <<15640612>>ప్యారడైజ్<<>>, <<18643470>>రౌడీ జనార్ధన<<>> వంటి సినిమాలే నిదర్శనం. పైగా ‘కథ డిమాండ్ చేసింది’ అనే డైలాగులు రొటీనైపోయాయి. బూతుల్లేకుండా కథలు చెప్పలేరా? సెన్సార్ బోర్డులేం చేస్తున్నాయి? అనేవి బిలియన్ డాలర్ల ప్రశ్నలు.

News December 22, 2025

పోలీసు వృత్తి సేవా భావంతో కూడుకున్నది: SP

image

కాకినాడల్ APSP 3వ బెటాలియన్‌లో 2025-26 బ్యాచ్‌ కానిస్టేబుళ్ల తొమ్మిది నెలల శిక్షణ కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా SP బిందు మాధవ్ శిక్షణను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాఖలో చేరడం అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, ప్రజల సేవకు అంకితమయ్యే బాధ్యతాయుతమైన వృత్తి అని పేర్కొన్నారు.

News December 22, 2025

వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట: ఆనం

image

ఈనెల 30 నుంచి జనవరి 8 వరకు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. పది రోజుల్లోని 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు (సుమారు 90 శాతం) వారికే కేటాయించారు. ఈ-డిప్‌లో టోకెన్లు పొందిన భక్తులు నిర్దేశిత సమయాల్లోనే తిరుమలకు రావాలని సూచించారు. AI టెక్నాలజీతో క్యూలైన్ల పర్యవేక్షణ, విస్తృత అన్నప్రసాదాలు, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.