News February 2, 2025
కొడంగల్: TGCPSEU జిల్లా కార్యదర్శిగా క్రాంతి కుమార్

తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొడంగల్ పట్టణానికి చెందిన క్రాంతి కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. పాత పెన్షన్ స్కీంను సాధించడమే తమ లక్ష్యమని చెప్పారు. తనను జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News February 9, 2025
NKP: చెర్వుగట్టులో ఘనంగా పూర్ణాహుతి

చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్ణాహుతి, ఏకాంత సేవలను వైభవంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, ఆర్చక బృందం ఆధ్వర్యంలో మహా పూర్ణహుతి, హోమం, ధ్వజారోహణం, ఏక దశ రుద్రాభిషేకం, జ్యోతి లింగార్చన, ఏకాంతసేవ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆయల ఈఓ నవీన్ కుమార్, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.
News February 9, 2025
వెంకన్న సేవలో మంత్రి సవిత

మంత్రి సవిత ఆదివారం వేకువజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొన్న ఆమె స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆమెకు శ్రీవారి ఆలయంలో టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రికి అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.
News February 9, 2025
ప్రకాశం జిల్లా పునర్విభజనపై మీ కామెంట్..!

అద్దంకిని బాపట్ల, కందుకూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేశారు. ఆ రెండు ఏరియాల ప్రజలకు గతంలో 50KM లోపే జిల్లా కేంద్రం(ఒంగోలు) ఉండేది. ఇప్పుడు ఆ దూరం పెరిగింది. ప్రస్తుతం మార్కాపురాన్ని జిల్లా చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఇదే సమయంలోనే అద్దంకి, కందుకూరును తిరిగి ప్రకాశంలో కలపాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మరి మీ ఏరియాను మార్కాపురం లేదా ప్రకాశం జిల్లాలో ఎక్కడ ఉంచాలో కామెంట్ చేయండి.