News March 11, 2025

కొడుకులు పట్టించుకోవడం లేదు.. కలెక్టర్‌కు దంపతుల ఫిర్యాదు

image

వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు కొడుకులు పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్‌ రాహుల్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. దేశి కోడయ్య (91), శివలక్ష్మి (85) దంపతులకు సత్యనారాయణ, కాశీనాథ్ కుమారులున్నారు. ఆస్తులన్నీ తీసుకున్న కొడుకులు వృద్ధాప్యంలో పట్టించుకోవడం లేదని ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వృద్ధులకు న్యాయం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Similar News

News November 28, 2025

మెదక్: నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

హవేలీఘనపూర్ నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. నామినేషన్లు పారదర్శకంగా, క్రమశిక్షణతో సాగాలని, అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. 29వ తేదీ చివరి రోజు కావడంతో అధిక సంఖ్యలో నామినేషన్లకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పత్రాలు సమృద్ధిగా ఉంచి, వెంటనే స్కాన్ చేయాలని, అభ్యర్థులు ఖర్చుల కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.

News November 28, 2025

రేపు మెదక్ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడలు

image

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈనెల 29న ఉదయం 10 గంటల నుంచి మెదక్‌లోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి వి.హేమ భార్గవి తెలిపారు. పరుగు పందెం, షాట్ పుట్, చెస్, కార్రమ్స్, జావెలిన్ త్రో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు, మహిళా సంఘ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, సమస్త దివ్యాంగులు పాల్గొనాలని కోరారు.

News November 28, 2025

ఫూలే వర్ధంతి: మంత్రి పొన్నం నివాళి

image

మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా మినిస్టర్‌ క్వార్టర్స్‌లో ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ కోసం ఫూలే చేసిన సేవలను స్మరించుకుంటూ నాయకులు, అధికారులు పుష్పాంజలి ఘటించారు. ఆయన చూపిన మార్గంలో నడిచి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు.