News March 16, 2025

కొడుకు సూసైడ్.. మనస్థాపంతో తల్లి ఆత్మహత్య

image

రైలు కిందపడి కొడుకు మృతి చెందడం జీర్ణించుకోలేక తల్లి సైతం రైలు కిందపడి మరణించింది. తాడిపత్రికి చెందిన శ్రీచరణ్ ప్రేమ వివాహానికి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ప్రసన్నాయిపల్లి వద్ద రైలు కిందపడి గురువారం సూసైడ్ చేసుకున్నాడు. అంత్యక్రియలు శుక్రవారం పూర్తిచేశారు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని తల్లి శైలజ శనివారం ఉదయం తాడిపత్రిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలు పలువురినీ కంటతడి పెట్టించాయి.

Similar News

News December 4, 2025

దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాల్లో వాగులు, నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అటు ప్రకాశం, ATP, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, CTR జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు రహదారులు, తోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

News December 4, 2025

సంక్రాంతి బరిలో నెగ్గేదెవరో?

image

ఈసారి సంక్రాంతి బరిలోకి 7 సినిమాలు దిగనున్నాయి. ప్రభాస్ ‘రాజా సాబ్’, మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. అటు విజయ్ ‘జననాయకుడు’, శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ బరిలో ఉన్నాయి. పోటీలో గెలిచే ‘పందెం కోడి’ ఏదని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News December 4, 2025

సంక్రాంతి శోభలా మెగా పీటీఎం నిర్వహించాలి: అనకాపల్లి కలెక్టర్

image

మెగా పేరెంట్స్ & టీచర్స్ మీటింగ్‌ను ఈనెల 5న సంక్రాంతి శోభలా నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ గురువారం విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులందరూ సమావేశంలో పాల్గొనే విధంగా చూడాలని ఆమె సూచించారు. ఈ మేరకు విద్యాసంస్థలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. తల్లిదండ్రులందరికీ ఆహ్వాన పత్రికలను అందజేయాలన్నారు. విద్యార్థుల ప్రతిభ, వారిలో ఉన్న సామర్ధ్యాలను ప్రదర్శించాలన్నారు.