News January 31, 2025
కొత్తకోట: పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం

కొత్తకోట పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన రాణి తన ఐదేళ్ల కూతురు, మూడేళ్ల కుమారుడితో కలిసి ఈనెల 23న శ్రీశైలం వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి శంకరమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాణి భర్త నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ఆనంద్ తెలిపారు.
Similar News
News December 4, 2025
రూ.5 లక్షలకు అఖండ-2 టికెట్

AP: అఖండ-2 మూవీ టికెట్ను చిత్తూరు MLA గురజాల జగన్మోహన్ రూ.5 లక్షలకు కొన్నారు. తనకు బాలకృష్ణపై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు. బాలకృష్ణ అభిమానుల సంఘం నాయకులు MLAను కలిసి సినిమా టికెట్ను అందజేశారు. ఓ అభిమానిగా సినిమా విజయవంతం కావాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే సాంకేతిక సమస్యల కారణంగా అఖండ-2 మూవీ ప్రీమియర్స్ను నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ రద్దు చేసిన విషయం తెలిసిందే.
News December 4, 2025
Party Time: గ్రామాల్లో జోరుగా దావతులు

పంచాయతీ ఎన్నికల పుణ్యమాని గ్రామాల్లో దావతులు జోరందుకున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ పల్లెల్లో సాయంత్రం కాగానే పెద్ద ఎత్తున పార్టీలు చేసుకుంటున్నారు. ఇందుకోసం పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను గ్రూపుల వారీగా విభజించి మద్యం, స్టఫ్ సమకూరుస్తున్నారు. ప్రతిరోజు కొన్ని గ్రూపులకు దావత్ ఏర్పాటు చేయాల్సి రావడంతో అభ్యర్థుల చేతి చమురు భారీగానే వదులుతోంది.
News December 4, 2025
విశాఖ: క్రికెటర్ కరుణ కుమారికి ఘన సత్కారం

అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖ బాలికల అంధుల రెసిడెన్షియల్ విద్యార్థిని కరుణ కుమారిని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఘనంగా సత్కరించారు. ప్రపంచ కప్కు సెలెక్ట్ అయిన తరువాత ప్రాక్టీస్కు అనుగుణంగా కరుణకుమారికి ప్రత్యేకంగా రెండు క్రికెట్ కిట్లకు రూ.50వేలు ఇవ్వడం జరిగిందన్నారు. భారత జట్టు విజయంలో కీలక ప్రతిభ చూపిన ఆమెకు ప్రోత్సాహకంగా కలెక్టర్ రూ.లక్ష చెక్ అందజేశారు


