News March 7, 2025

కొత్తకోట: రోడ్డు ప్రమాదంలో సీడీసీ ఛైర్మన్ మృతి

image

సీడీసీ ఛైర్మన్ పాపయ్యగారి చంద్రశేఖర్ రెడ్డి(55) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సాకారంతో ఉమ్మడి జిల్లా సీడీసీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. గురువారం హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడంతో కొత్తకోటతో పాటు కాంగ్రెస్ పార్టీలో విషాదఛాయలు అలముకున్నాయి.

Similar News

News December 21, 2025

ఉమ్మడి తూ.గో. జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరే..

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులను పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేసి, వారి పేర్లను ఆదివారం అధికారికంగా ప్రకటించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షునిగా గుత్తుల సాయి ప్రసాద్ ను నియమించారు. కాకినాడ జిల్లా అధ్యక్షునిగా జ్యోతుల నవీన్ పేరును ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షునిగా బొడ్డు వెంకటరమణ చౌదరిని ఖరారు చేశారు. ప్రధాన కార్యదర్శులను కూడా ప్రకటించారు.

News December 21, 2025

ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ వర్సిటీలో టీచింగ్ పోస్టులు

image

AP: ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ 7 టీచింగ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BSc, MSc(హోమ్ సైన్స్, కమ్యూనిటీ సైన్స్, హ్యూమన్ డెవలప్‌మెంట్ & ఫ్యామిలీ స్టడీస్), PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు(M), మహిళలకు 45ఏళ్లు. అర్హతగల వారు ఈనెల 29, 30 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. వెబ్‌సైట్: https://angrau.ac.in

News December 21, 2025

‘కెరీర్ మినిమలిజం’.. Gen Zలో కొత్త ట్రెండ్.. ఏంటిది?

image

ఆఫీసుల్లో రాత్రి పగలు కష్టపడే హజిల్ కల్చర్‌కు Gen Z చెక్ పెడుతోంది. దీన్నే కెరీర్ మినిమలిజం అంటున్నారు. అంటే పని పట్ల బాధ్యత లేకపోవడం కాదు. ప్రమోషన్లు, హోదాల వెంట పడకుండా ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వడం. మేనేజర్ పోస్టుల్లో ఉండే స్ట్రెస్ కంటే మెంటల్ హెల్త్, పర్సనల్ లైఫ్ ముఖ్యమని వీరు భావిస్తున్నారు. 72% మంది టీమ్ మేనేజ్‌మెంట్ కంటే స్కిల్స్ పెంచుకోవడానికే ఇష్టపడుతున్నారు.