News March 7, 2025

కొత్తకోట: రోడ్డు ప్రమాదంలో సీడీసీ ఛైర్మన్ మృతి

image

సీడీసీ ఛైర్మన్ పాపయ్యగారి చంద్రశేఖర్ రెడ్డి(55) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సాకారంతో ఉమ్మడి జిల్లా సీడీసీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. గురువారం హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడంతో కొత్తకోటతో పాటు కాంగ్రెస్ పార్టీలో విషాదఛాయలు అలముకున్నాయి.

Similar News

News March 21, 2025

స్టేషన్ ఘనపూర్‌లో మరోసారి బయటపడ్డ కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు

image

స్టే.ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. గురువారం ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలకు 42% రిజర్వేషన్ ఆమోదం పొందడంతో సింగపురం ఇందిర వర్గానికి చెందన కాంగ్రెస్ రాష్ట్రమహిళా అధ్యక్షురాలు మౌనిక, మండల అధ్యక్షురాలు పద్మలు సీఎంతో పాటు పలువురి చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. ఈ ఫ్లెక్సీపై స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య ఫొటో లేకపోవడంతో మండలంలో చర్చనీయాంశమైంది.

News March 21, 2025

మెదక్: టెన్త్ పరీక్షలకు అంతా రెడీ: డీఈవో

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు మెదక్ జిల్లా విద్యాధికారి రాధా కిషన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ జిల్లా వ్యాప్తంగా 68 పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి విద్యార్థులు పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాటు చేశామన్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 10,388 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు.

News March 21, 2025

నిర్మల్: ఖాళీ పోస్టులు.. APPLY NOW

image

జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుందని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు వైద్య కళాశాలలో టీచింగ్ స్టాప్ ఫ్యాకల్టీలను భర్తీ చేస్తామన్నారు. కలెక్టర్ అనుమతితో వైద్య కళాశాలలో వివిధ విభాగంలోని టీచింగ్ స్టాఫ్ ఫ్యాకల్టీలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తామని పేర్కొన్నారు.

error: Content is protected !!