News March 2, 2025
కొత్తగూడెంకి ఎయిర్ పోర్ట్.. కేంద్రమంత్రి క్లారీటీ..!

కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. గతంలో ప్రభుత్వం ఓ స్థలం కేటాయించిందని.. కానీ ఆస్థలం ఫీజుబిలిటీ లేదని ప్రభుత్వానికి తెలపగా మరో స్థలం కేటాయించిందన్నారు. అక్కడ AAI ఫీజుబిలిటీ స్టడీ చేసిందన్నారు. కానీ ఆ స్థలానికి రిమార్క్స్ ఉన్నాయని ఆ ప్రాంతం డేటా కావాలని ప్రభుత్వానికి సూచించామన్నారు. ఆ డేటా వచ్చిన తరువాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
Similar News
News December 9, 2025
MNCL: ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

ఈ నెల 11న జరగనున్న మొదటి విడత సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని అన్నారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలింగ్ రోజు తీసుకోవలసిన చర్యలు, ఓట్ల లెక్కింపు, ఉపసర్పంచ్ ఎన్నిక, ప్రవర్తన నియమావళి అమలు, ఓటర్ల ప్రభావిత అంశాలను అరికట్టడంపై సూచనలు చేశారు.
News December 9, 2025
తిరుపతి జిల్లాలో విషాదం.. ఇద్దరు మృతి

తిరుపతి(D) నారాయణవనం మండలంలో విషాద ఘటన జరిగింది. నగరి(ఛ) గుండ్రాజుకుప్పానికి చెందిన గుణశేఖర్(42) తిరువట్యంలో జరిగిన బంధువుల దహనక్రియలకు హాజరయ్యారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా తిరువట్యం కాజ్వే వద్ద నారాయణవనం రజక కాలనీకి చెందిన అంకమ్మ(72) బట్టలు ఉతుకుతూ నదిలో పడిపోవడాన్ని ఆయన గుర్తించారు. ఆమెను కాపాడడానికి గుణశేఖర్ నదిలోకి దూకారు. ఈత రాకపోవడంతో వృద్ధురాలితో పాటు అతనూ నీట మునిగి చనిపోయారు.
News December 9, 2025
ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్

మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. మొదటి దశ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అబ్జర్వర్లతో ఆమె మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. సిరిసిల్ల కలెక్టరేట్ నుంచి ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.


