News February 13, 2025
కొత్తగూడెంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

భద్రాద్రి కొత్తగూడెంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. 30 నుంచి 35 డీగ్రీల వరకు నమోదువుతున్నాయి. రాత్రి పూట చలికి.. పగటిపూట ఎండకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి పండ్ల రసాలు, కొబ్బరి బొండాల వైపు మొగ్గు చూపడంతో వాటి ధరలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత వల్ల ప్రజలు రోడ్లపైకి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.
Similar News
News October 23, 2025
VKB:”తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వేలో పాల్గొనాలి: కలెక్టర్

“తెలంగాణ రైజింగ్ – 2047” సిటిజన్ సర్వేలో జిల్లా ప్రజలందరూ పాల్గొనాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. 2047లో రాష్ట్రం ఎలా ఉండాలనే దిశగా ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టిందని తెలిపారు. ప్రజలు తమ విలువైన సూచనలు, సలహాలను www.telangana.gov.in/telanganarising వెబ్సైట్ ద్వారా అందించవచ్చని కలెక్టర్ సూచించారు.
News October 23, 2025
ఇండియన్ ఆర్మీకి ‘భైరవ్’

భారత సైన్యానికి మరింత బలం చేకూరనుంది. అత్యాధునిక టెక్నాలజీ, శక్తిమంతమైన ఆయుధాలతో స్పందిస్తూ రిస్కీ ఆపరేషన్లు చేసే ‘భైరవ్’ బెటాలియన్ సిద్ధమైతున్నట్లు ఆర్మీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ అజయ్ కుమార్ తెలిపారు. నవంబర్ 1న తొలి బెటాలియన్ సైన్యంలో చేరనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఆరు నెలల్లో 25 బెటాలియన్లను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఈ భైరవ్ యూనిట్లో 250 మంది సైనికులు, 7-8 మంది అధికారులు ఉంటారు.
News October 23, 2025
కార్తీక మాసం: ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినకూడదు?

ఉల్లి, వెల్లుల్లి రజో, తమో గుణాల ప్రభావాన్ని పెంచుతాయి. రజో గుణం మనస్సులో కోరికలను పెంచుతుంది. తమో గుణం వల్ల బద్ధకం, అజ్ఞానం ఆవరించే అవకాశాలుంటాయి. ఇది దైవ స్మరణ కోసం కేటాయించిన పవిత్ర సమయం. ఈ సమయంలో పూజలు ఏకాగ్రతతో చేయాలంటే, ఇంద్రియాలను అదుపులో ఉంచాలి. అది జరగాలంటే భగవత్ చింతనకు ఆటంకం కలిగించే ఈ పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక శుద్ధి కోసం వీటిని తినకుండా ఉండటం ఉత్తమం అని సూచిస్తుంటారు.