News February 11, 2025

కొత్తగూడెం: అత్యాచారయత్నం.. తప్పించుకున్న యువతి

image

అనిశెట్టిపల్లి వద్ద <<15422949>>రాత్రి <<>> అక్కడి గ్రామస్థులకు ఓ యువతి లభ్యమైన విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. CGకి చెందిన యువతి(20) కొత్తగూడెంలోని బంధువుల ఇంట్లో ఉంటూ కూలీపనులు చేస్తోంది. ఉదయం ఓ ఆటోడ్రైవర్ పని ఇప్పిస్తానని ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. సహకరించకపోవడంతో కత్తితో దాడి చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న యువతి గ్రామస్థులకు విషయం తెలిపింది. కేసు నమోదైంది.

Similar News

News November 25, 2025

ఖమ్మం కార్పొరేషన్‌లో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల హవా!

image

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికార కాంగ్రెస్ కార్పొరేటర్ల కంటే బీఆర్‌ఎస్ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మున్సిపల్ కాంట్రాక్టులు, ఎల్‌ఆర్‌ఎస్ పనులలో అధికారులు వారికే సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ నిర్మాణాలపై, రిజిస్ట్రేషన్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ వ్యక్తమవుతోంది.

News November 25, 2025

ఖమ్మం: అంతా ‘మొంథా’ర్పణం

image

ఖమ్మం జిల్లాలో ‘మొంథా’ తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని వ్యవసాయశాఖ సర్వేచేసి తుది నివేదిక విడుదల చేసింది. జిల్లాలో 17మండలాల్లో 4,268మంది రైతులకు చెందిన 1, 710.72హెక్టార్లలో పంటలకు నష్టం జరిగిందని తేల్చారు. 1,499.43 ఎకరాల్లో వరి, 115.82హెక్టార్లలో పత్తికి నష్టం వాటిల్లిందిని కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. అత్యధికంగా కూసుమంచి డివిజన్‌లో 766.12 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

News November 25, 2025

ఎన్పీడీసీఎల్‌లో 17 మంది ఇంజనీర్లకు పదోన్నతులు

image

ఎన్పీడీసీఎల్ (NPDCL) సీఎండీ వరుణ్ రెడ్డి సంస్థలోని పలువురు ఇంజనీర్లకు పదోన్నతులు కల్పిస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం సర్కిల్ పరిధిలో ముగ్గురు ఏడీఈలకు డీఈలుగా, 14 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు ఏడీఈలుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన రాందాసు కార్పొరేట్ ఆఫీస్‌కు, రమేష్ వైరా డివిజన్‌కు బదిలీ అయ్యారు. ఈ చర్యతో విభాగాల పనితీరు మెరుగుపడుతుందని సంస్థ తెలిపింది.