News March 4, 2025
కొత్తగూడెం: ఆన్లైన్ ద్వారా మధ్యాహ్న భోజన చెల్లింపు

విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపుపై జిల్లా కలెక్టర్లతో, విద్యాశాఖ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐడీవోసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ట్రెజరీ ద్వారా బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఆలస్యం అవుతోందని, నేరుగా ఆన్లైన్ నుంచే మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లించేందుకు విద్యాశాఖ పరిశీలిస్తుందని అన్నారు.
Similar News
News November 6, 2025
ములుగు : ప్రాణాంతకంగా అడవి పందులు, కోతులు..!

జిల్లాలో కోతులు, అడవి పందుల బెడద ప్రమాదాలకు దారితీస్తోంది. ఈ రెండు ప్రాణులు ఇప్పుడు మనుషులకు ప్రాణాంతకంగా మారాయి. గ్రామాలలో మందలుగా తిరుగుతున్న కోతులు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో చాలామంది గాయపడుతున్నారు. పంటలను నాశనం చేస్తున్నాయి. ఇదే తరహాలో అడవి పందులు పంటల పంటలను ధ్వంసం చేస్తున్నాయి. కాపలాకు వెళ్లిన రైతులపై దాడులకు పాల్పడుతున్నాయి. వీటిని నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
News November 6, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 6, 2025
ADB: ఈ రెండో శనివారం సెలవు రద్దు

ఈ నెల 8న రెండో శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలకు పని దినాలుగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 28న అత్యధిక వర్షం కురిసిన నేపథ్యంలో సెలవులు ఇవ్వడంతో ఆ సెలవు దినానికి బదులుగా ఈ శనివారం విద్యా సంస్థల సెలవు రద్దు చేశామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యా సంస్థలు గమనించాలని సూచించారు.


