News April 1, 2025

కొత్తగూడెం: ఇంటర్ లాకింగ్ కారణంగా ఆ రైళ్లు రద్దు.!

image

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 32 రైళ్లు రద్దయినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. మరో 11 రైళ్ల దారి మళ్లించినట్లు పేర్కొంది. సౌత్ ఈస్ట్ సెంట్ర‌ల్ రైల్వేలోని కోటార్లియా స్టేష‌న్‌లో ఇంట‌ర్‌ లాకింగ్ ప‌నుల కార‌ణంగా రెండు రైళ్లు ర‌ద్దు చేశారు. విజ‌య‌వాడ‌ – భ‌ద్రాచ‌లం (67215) రైలు, భ‌ద్రాచలం – విజ‌య‌వాడ (67216) రైలును మే 23 నుంచి మే 29 వ‌ర‌కు ర‌ద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Similar News

News December 5, 2025

నర్సంపేట: భారీ పోలీస్ బందోబస్తు నడుమ CM పర్యటన

image

సీఎం రేవంత్ రెడ్డి నేడు నర్సంపేటకు రానుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 575 మందికి పైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో డీసీపీలతో పాటు, ఏసీపీలు, సీఐలు, ఎస్సై, ఆర్ఐ, డిస్ట్రిక్ట్ గార్డ్స్, బాంబ్ డిస్పోజల్, ట్రాఫిక్ పోలీసులు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోం గార్డ్స్ ఉన్నారు.

News December 5, 2025

రైతన్నా.. ఈ పురుగుతో జాగ్రత్త

image

ఖరీఫ్ పంట కోతలు, రబీ పంట నాట్ల వేళ ఏపీ వ్యాప్తంగా 800కు పైగా స్క్రబ్‌టైఫస్ కేసులు నమోదవ్వడం కలవరపెడుతోంది. చిగ్గర్ అనే పురుగు కాటుకు గురైనవారు తీవ్రజ్వరం, ఒంటి నొప్పులు, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిపాలవుతున్నారు. పొలాలు, అడవులు, తడి నేల, పశువుల మేత ప్రాంతాల్లో పని చేసేవారికి ఈ పురుగుకాటు ముప్పు ఎక్కువగా ఉంది. స్క్రబ్ టైఫస్ లక్షణాలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 5, 2025

రో-కో భవిష్యత్తును వారు నిర్ణయించడం దురదృష్టకరం: హర్భజన్

image

తమ కెరీర్‌లో పెద్దగా ఏం సాధించని వారు రోహిత్, కోహ్లీ భవిష్యత్తును నిర్ణయిస్తుండటం దురదృష్టకరమని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ వ్యాఖ్యానించారు. తనతో పాటు తన సహచరులకు ఇలాంటి పరిస్థితే ఎదురైందని చెప్పారు. రోహిత్, కోహ్లీ నిరంతరం పరుగులు చేస్తూ బలంగా ముందుకు సాగుతున్నారన్నారు. AUS సిరీస్‌కు ముందు నుంచే కోచ్ గంభీర్‌తో ‘రో-కో’కు పడట్లేదన్న పుకార్ల నడుమ భజ్జీ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.