News March 29, 2025
కొత్తగూడెం ఇఫ్తార్ విందులో కలెక్టర్, SP, MLA

మతసామరస్యాన్ని చాటుతూ.. లౌకిక విలువలను కాపాడుకుందామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, డీఎస్పీ రెహమాన్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే.షాబిర్ పాషాతో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రజల మధ్య ఇఫ్తార్ విందు ఐక్యత భావం పెంచుతుందని వారు అన్నారు. సమాజంలో రంజాన్ మాసం శాంతి నెలకొల్పుతుందని తెలిపారు.
Similar News
News September 17, 2025
ఆదిలాబాద్: రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోంది: ఎస్పీ

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదిలాబాద్లోని ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. 1948 సెప్టెంబర్ 17వ తేదీన నిజాం నియంత పాలన అంతమైందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ కృతనిశ్చయంతో విధులు నిర్వహించాలన్నారు.
News September 17, 2025
ములుగు: బీఆర్ఎస్ నేత వ్యాఖ్యలపై రైతులు ఫైర్.. నిరసన ప్రదర్శనకు సన్నద్ధం!?

తన ఆస్తి మొత్తం ఇస్తా.. ములుగు కలెక్టర్ను వదిలిపెట్టొద్దంటూ బీఆర్ఎస్ నేత, విత్తన కంపెనీ ఏజెంట్ నర్సింహమూర్తి చేసిన వ్యాఖ్యలపై మొక్కజొన్న రైతులు ఫైర్ అవుతున్నారు. నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. నకిలీ విత్తనాల కారణంగా జిల్లాలో 671 మంది 1521 ఎకరాల్లో నష్టపోయారు. కలెక్టర్ దివాకర చొరవతో జులై 7న మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, సీతక్క చేతుల మీదుగా రూ.3.8 కోట్లు పరిహారం ఇచ్చారు.
News September 17, 2025
ADB: డిగ్రీలో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్లోని గిరిజన సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శివకృష్ణ తెలిపారు. ఈనెల 18, 19న అడ్మిషన్లు ఉంటాయని తెలిపారు. బీఏలో 1, బీకాం (సీఏ)లో 3, బీఎస్సీ బీజేడ్సీలో 3, ఎంపీసీఎస్లో 14 , డాటా సైన్స్లో 22 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాలకు 9849390495 నంబర్కు సంప్రదించాలన్నారు.