News January 23, 2025

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుతో మరింత అభివృద్ధి: ఎంపీ

image

దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం పుణ్యక్షేత్రం సందర్శన కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వల్ల సులభం అవుతుందని ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి తెలిపారు. సింగరేణి హెడ్ ఆఫీస్, KTPS, స్పాంజ్ ఐరన్, నవభారత్, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ పేపర్ బోర్డు ఇలా ప్రఖ్యాత పరిశ్రమలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయని వివరించారు. పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కదలిక తీసుకురావడం జరిగిందన్నారు.

Similar News

News November 26, 2025

టెక్కలి: సెప్టిక్ ట్యాంక్‌లో పడి చిన్నారి మృతి

image

టెక్కలిలోని మండాపోలం కాలనీకి చెందిన కొంకి భవ్యాన్ (5) బుధవారం సాయంత్రం సెప్టిక్ ట్యాంక్‌లో పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సాయంత్రం తన ఇంటికి సమీపంలో ఆడుకుంటూ ఉండగా నిర్మాణ దశలో ఉన్న మరో ఇంటికి చెందిన సెప్టిక్ ట్యాంక్‌లో ప్రమాదవశాత్తు పడిపోవడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News November 26, 2025

నిరూపించండి.. రాజీనామా చేస్తా: MLC భూమిరెడ్డి

image

మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. బుధవారం అమరావతిలో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో రాయలసీమకు అదనంగా ఒక్క ఎకరాకు నీరు ఇచ్చారా?, అరటి పంటకు బీమా ఎక్కడ చెల్లించాలో చెప్పాలని ప్రశ్నించారు. బీమా చెల్లించినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని జగన్‌కు ఆయన సవాల్ విసిరారు. జగన్ వల్లే పులివెందులలో బనానా ప్రాసెసింగ్ యూనిట్ మనుగడలోకి రాలేదన్నారు.

News November 26, 2025

నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

సాధారణ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. బుధవారం తహశీల్దార్లు, ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. నామినేషన్ కేంద్రాల్లో సీసీ కెమెరా పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని, గడువు తర్వాత నామినేషన్లు స్వీకరించరాదని సూచించారు.