News July 20, 2024

కొత్తగూడెం: ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇకపై ప్రతి సోమవారం ఉ.11 గంటల నుండి ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదులకు వీలుగా “గ్రీవెన్స్ డే”ను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను జిల్లా ఎస్పీకి నేరుగా తెలపడానికి అవకాశం కల్పిస్తున్నందున ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Similar News

News December 10, 2025

పాల్వంచ వ్యక్తికి ఏడాది జైలు

image

చెక్ బౌన్స్ కేసులో భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన భాసబోయిన వేణుకు ఖమ్మం అదనపు కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. రఘునాథపాలెంకు చెందిన వ్యక్తి వద్ద 2022లో వేణు రూ.9.90 లక్షలు అప్పు తీసుకుని, తిరిగి చెల్లించేందుకు ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో కేసు దాఖలైంది. న్యాయాధికారి బిందుప్రియ విచారణ అనంతరం ఈ తీర్పును వెలువరించారు.

News December 10, 2025

26 లోపు ఓపెన్ పరీక్ష ఫీజు చెల్లించాలి: DEO

image

పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి, ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు డీఈవో చైతన్య జైని తెలిపారు. అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ 26 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. థియరీకి టెన్త్‌కు రూ.100, ఇంటర్‌కు రూ.150 ఫీజుగా నిర్ణయించారు. తత్కాల్ స్కీంలో అదనంగా టెన్త్‌కు రూ.500, ఇంటర్‌కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

News December 10, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన
∆} మధిర ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.