News July 3, 2024

కొత్తగూడెం: చెట్టు కింద చదువు.. 54 మందికి ఒక్కరే టీచర్

image

తెలంగాణ ఏర్పడి పదేళ్లు దాటుతున్నా ఇంకా చెట్ల కింద చదువుకుంటున్న పరిస్థితి వెంకటాపురం మండలంలో బోధపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది. 54 మంది పైగా చదువుకుంటున్న ఈ పాఠశాలలో ఒక్కరే టీచర్ ఉన్నారని విద్యార్థిని తల్లిదండ్రులు చెప్పారు. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలలో ఉండేందుకు ఇబ్బందులు పడుతున్నామని.. నూతన భవనాలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

Similar News

News October 26, 2025

ఖమ్మం: మనోళ్లు జూబ్లీహిల్స్‌లో బిజీ

image

జూబ్లీహిల్స్‌లో ఖమ్మం నాయకులు బిజీ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల స్టార్ క్యాంపెయినర్లుగా అక్కడ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబు క్యాంపెయిన్ చేస్తున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ తాతా మధుకు బీఆర్ఎస్ ప్రచార బాధ్యతలు అప్పగించింది.

News October 26, 2025

ఓటర్ల జాబితా పకడ్బందీగా పూర్తి చేయాలి: ఎన్నికల అధికారి

image

ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి వీసీ ద్వారా సమీక్షించారు. ఎస్.ఐ.ఆర్. జాబితా పూర్తి, 2002–2025 మధ్య కొత్త ఓటర్ల వివరాలను బూత్ స్థాయిలో ధృవీకరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. బూత్ అధికారులు BL0 యాప్ ద్వారా మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ఈ వీసీలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్‌లు పాల్గొన్నారు.

News October 25, 2025

పఠన సామర్థ్యం కోసం ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’

image

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పఠన సామర్థ్యం పెంచే లక్ష్యంతో అక్టోబర్ 27 నుంచి ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు దీనిని అమలు చేయాలని ఆదేశించారు. ఆంగ్ల భాష ఫొనెటిక్స్ ఆధారంగా రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు సులభంగా చదవడం నేర్పాలన్నారు.