News April 7, 2025
కొత్తగూడెం జిల్లాలో నేడు ప్రజావాణి రద్దు

భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం ఉన్నందున సోమవారం కొత్తగూడెం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు పట్టాభిషేక కార్యక్రమంలో ఉండటం వల్ల ప్రజావాణిని రద్దు చేసినట్లు చెప్పారు. కావున జిల్లా ప్రజలు ఎవరు కూడా తమ సమస్యలపై ప్రజావాణికి రావొద్దని సూచించారు.
Similar News
News November 6, 2025
KGF నటుడు కన్నుమూత

కేజీఎఫ్ నటుడు <<17572420>>హరీశ్ రాయ్<<>> కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. KGF-1లో హరీశ్ రాయ్.. ఛాఛా అనే పాత్రలో నటించారు. రెండో పార్ట్ రిలీజైన నాటికే ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. అది నాలుగో స్టేజీకి చేరడంతో పూర్తిగా బక్కచిక్కిపోయారు. ఆర్థిక సాయం చేయాలని కోరగా నటుడు ధ్రువ్ సర్జా హెల్ప్ చేశారు. పరిస్థితి చేజారిపోవడంతో ఆయన మరణించారు.
News November 6, 2025
RGM: రోజుకు 2.75లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తేనే టార్గెట్ రీచ్

సింగరేణి వ్యాప్తంగా(2025- 26) ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్ను నిర్దేశించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈసారి భారీ వర్షాలు, తుఫాను నేపథ్యంలో 11 డివిజన్లలో గడిచిన 7 నెలల్లో 32.64 MTల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించింది. ఇకపై టార్గెట్ రీచ్ కావాలంటే రోజుకు 2.75లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.
News November 6, 2025
మెదక్: అవినీతి నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్

అవినీతి నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అవినీతి జాడ్యాన్ని రూపుమాపాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. ప్రతి రోజు అవినీతి డబ్బుతో ఏసీబీకి దొరకడం బాధాకరమన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి అధికారులు, సిబ్బంది బాధ్యత అన్నారు.


