News April 7, 2025

కొత్తగూడెం జిల్లాలో నేడు ప్రజావాణి రద్దు

image

భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం ఉన్నందున సోమవారం కొత్తగూడెం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్‌ వి పాటిల్ ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు పట్టాభిషేక కార్యక్రమంలో ఉండటం వల్ల ప్రజావాణిని రద్దు చేసినట్లు చెప్పారు. కావున జిల్లా ప్రజలు ఎవరు కూడా తమ సమస్యలపై ప్రజావాణికి రావొద్దని సూచించారు.

Similar News

News October 13, 2025

ఇండియన్ ఆర్మీ DG EMEలో 69 పోస్టులు

image

ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్( DG EME)69 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, స్టెనోగ్రాఫర్, LDC, MTS, దోబీ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వెబ్‌సైట్: https://www.indianarmy.nic.in.

News October 13, 2025

నిజామాబాద్: పోలీసు సిబ్బందికి ఉలెన్ జాకెట్స్ అందజేత

image

చలికాలం సమీపించిన నేపథ్యంలో విధి నిర్వహణలో పోలీసులకు ఉపయుక్తంగా ఉండే ఉలెన్ జాకెట్స్, హావర్ సాక్స్‌లను నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అందజేశారు. ఈ మేరకు సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో ఏఆర్, సివిల్ పోలీసు సిబ్బందికి ఉలెన్ జాకెట్స్ అందజేసి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, స్పెషల్ బ్యాంక్ సబ్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ రెడ్డి, RSI నిషిత్, సుమన్ పాల్గొన్నారు.

News October 13, 2025

HYD: అబ్బాయిలపై లైంగిక దాడి.. నిందితుడి ARREST

image

HYD సైదాబాద్ <<17990748>>బాలసదన్‌లో లైంగిక దాడి<<>> జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై ఓ బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రెహమాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఐదుగురు అబ్బాయిలకు పోలీసులు వైద్య పరీక్షలను చేయించనున్నారు. కాగా ఈ ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా సీరియస్‌గా స్పందించింది.