News March 4, 2025

కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాలు 

image

కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా వైద్య విధాన పరిషత్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆసుపత్రుల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం కోసం అధునాతన యంత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

Similar News

News November 13, 2025

కొండా సురేఖ క్షమాపణలు.. కేసు విత్‌డ్రా చేసుకున్న నాగార్జున

image

TG: మంత్రి కొండా సురేఖ <<18263475>>క్షమాపణలు<<>> చెప్పడంతో సీనియర్ హీరో నాగార్జున పరువునష్టం కేసును విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో నాంపల్లి కోర్టు ఆ కేసును కొట్టివేసింది. కాగా నిన్న కొండా సురేఖ నాగార్జునకు ట్విటర్ (X) వేదికగా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. సమంత విడాకుల విషయంలో మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు గతంలో సంచలనం రేపాయి. దీంతో నాగార్జున ఆమెపై పరువునష్టం దావా వేశారు.

News November 13, 2025

విశాఖలో ఒకేరోజు 5 ఐటీ కంపెనీలకు భూమిపూజ

image

భాగస్వామ్య సదస్సు ముందు మంత్రి నారా లోకేశ్ మధురవాడ ఐటీ హిల్, యండాడ ప్రాంతాల్లో 5సంస్థలకు భూమిపూజ చేశారు. రూ.3,800 కోట్ల పెట్టుబడులతో ఈ సంస్థలు 30వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నాయి. సైల్స్ సాఫ్ట్‌వేర్, ఐస్పేస్, ఫినోమ్ పీపుల్స్, రహేజా, కపిల్ గ్రూప్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాజెక్టులకు లోకేశ్ శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో పారిశ్రామికవేత్తలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

News November 13, 2025

ములుగు: ఎక్సైజ్ శాఖలో వాహనాలకు వేలంపాట

image

ములుగు ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు రేపు వేలంపాట నిర్వహించనున్నట్లు సీఐ సుధీర్ కుమార్ తెలిపారు. ఉ. 11 గంటలకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గలవారు వాహనం ధరలో 50% చెల్లించి పాల్గొనాలన్నారు. వాహనం పొందిన వారు అదే రోజు పూర్తి సొమ్మును చెల్లించి వాహనాన్ని తీసుకెళ్లాలని కోరారు.