News April 7, 2025
కొత్తగూడెం జిల్లా ప్రజలకు CM గుడ్ న్యూస్

శ్రీరామనవమి సందర్భంగా ఖమ్మం జిల్లా రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.13,057 కోట్లను సవరించి రూ.19,324 కోట్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అలాగే కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా ఆమోదం లభించింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 8, 2026
TODAY HEADLINES

☛ 2027 నాటికి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యం: CM CBN
☛ అమిత్ షాతో చంద్రబాబు భేటీ.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ
☛ ఏపీలో ‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపు.. బెనిఫిట్ షో టికెట్ రూ.1000
☛ TGలో మున్సిపల్ ఎన్నికలు.. ఈనెల 16న ఓటర్ల తుది జాబితా విడుదల
☛ TGలో సంక్రాంతి స్పెషల్ బస్సుల్లో ఛార్జీల పెంపు
☛ ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేత
☛ T20 WC: భారత్లోనే బంగ్లాదేశ్ మ్యాచులు!
News January 8, 2026
Official: ‘జన నాయగన్’ విడుదల వాయిదా

విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అనివార్య కారణాలతో విడుదలను నిలిపివేస్తున్నట్లు KVN ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం అవుతూ వచ్చింది. కొన్ని సన్నివేశాలు తొలగించాలని సూచించిన సెన్సార్ బోర్డు, మార్పుల తర్వాత స్పందించలేదు. దీంతో నిర్మాణ సంస్థ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.
News January 8, 2026
కరీంనగర్: మితిమీరిన వేగం ప్రాణాంతకం: డీటీసీ

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా నుస్తులాపూర్ వద్ద రవాణా, ట్రాఫిక్ పోలీసులు ఉమ్మడిగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు మితిమీరిన వేగంతో నడపడం ప్రాణాంతకమని డీటీసీ పురుషోత్తం పేర్కొన్నారు. ఎస్హెచ్-1 రహదారిపై తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన 10 వాహనాలకు జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ వేగ నియంత్రణ పాటించాలని సూచించారు.


