News February 2, 2025
కొత్తగూడెం: దివ్యాంగులకు శుభవార్త.. గడువు పొడిగింపు

దివ్యాంగులకు సబ్సిడీ లోన్స్ దరఖాస్తు గడువును ఫిబ్రవరి 12వ తేదీ వరకు పొడిగించారని జిల్లా సంక్షేమ శాఖ అధికారి జేఎం స్వర్ణలత తెలిపారు. ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీం ద్వారా స్వయం ఉపాధి, పునరావాసం, చేతి వృత్తులు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోడానికి జిల్లాలోని దివ్యాంగులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. tgobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలన్నారు.
Similar News
News November 17, 2025
నంద్యాల: పీజీఆర్ఎస్కు 81 ఫిర్యాదులు

నంద్యాలలోని బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 81 ఫిర్యాదులను స్వీకరించినట్లు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్. యుగంధర్ బాబు తెలిపారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని ఆయన అధికారులను ఆదేశించారు.
News November 17, 2025
నంద్యాల: పీజీఆర్ఎస్కు 81 ఫిర్యాదులు

నంద్యాలలోని బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 81 ఫిర్యాదులను స్వీకరించినట్లు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్. యుగంధర్ బాబు తెలిపారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని ఆయన అధికారులను ఆదేశించారు.
News November 17, 2025
బోసిపోయిన భూపాలపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం

ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా రిజస్టర్, సబ్ రిజిస్టర్ కార్యాలయల్లో జరిగిన ఏసీబీ దాడుల తర్వాత భూపాలపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం బోసిపోయింది. భూపాలపల్లిలో రెండు రోజులుగా డాక్యుమెంట్, రైటర్ షాపులు తెరుచుకోక పోవడంతో భూమి క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మ్యారేజీ రిజిస్ట్రేషన్లు మాత్రమే కొనసాగుతున్నాయి.


