News February 11, 2025
కొత్తగూడెం: నిర్మానుష్య ప్రదేశంలో గాయాలతో యువతి..?

లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి జాతీయ ప్రధాన రహదారి పక్కన గల నిర్మానుష్య ప్రదేశంలో ఓ యువతి గాయాలతో పడి ఉందని స్థానికులు తెలిపారు. గుత్తి కోయ యువతిగా స్థానికులు గుర్తించారు. ఆమెపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి గాయపరిచారని చెప్పారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువతిని స్థానికుల సమాచారంతో ఎస్ఐ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 9, 2026
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయిలో ‘మక్క’ సాగు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది మొక్కజొన్న సాగు రికార్డు స్థాయికి చేరింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 1.69 లక్షల ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 72 వేల ఎకరాల్లో పంట సాగైంది. మార్కెట్లో క్వింటాల్ ధర రూ.1800 లోపే ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే రూ.2400 మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, అకాల వర్షాల నుండి అన్నదాతలను ఆదుకోవాలని కోరుతున్నారు.
News March 9, 2026
కామేపల్లిలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

కామేపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్ సైకిళ్లు ఢీకొనడంతో ఊట్కూరుకి చెందిన దుగ్గి సాయి (22) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో షేక్ అఖిల్ పాషాతో పాటు మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 8, 2026
ప్రతి కరెంట్ స్తంభానికి ‘యూనిక్’ నెంబర్: ఖమ్మం ఎస్ఈ

ఖమ్మం జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి జీఐఎస్ మ్యాపింగ్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు ఎస్ఈ శ్రీనివాసాచారి తెలిపారు. 33 కేవీ లైన్లలో 55 ఫీడర్లు, 11 కేవీ లైన్లలో 545 ఫీడర్లకు యూనిక్ పోల్ నెంబర్లు కేటాయించారు. దీనివల్ల సమస్యలు వచ్చినప్పుడు పోల్ నెంబర్ ద్వారా లొకేషన్ గుర్తించి, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయవచ్చని వివరించారు. ఈ టెక్నాలజీతో విద్యుత్ అంతరాయాలకు చెక్ పడనుంది.


