News April 14, 2025

కొత్తగూడెం: పిల్లలపై నిరంతరం అప్రమత్తంగా ఉండండి

image

మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికీ అప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

Similar News

News February 24, 2026

KNR: ‘మహిళా కార్యకర్తలు కృషి చేయాలి’

image

కరీంనగర్ DCC కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి ఆధ్వర్యంలో నేడు సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత పదేళ్లుగా పార్టీ కోసం పోరాడిన సీనియర్ మహిళా నేతలకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. రాబోయే ZPTC, MPTC ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి మహిళా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News February 24, 2026

కేయూ: మార్చి 6 నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు

image

కేయూలో వాయిదా పడిన మొదటి సెమిస్టర్ పరీక్షల రీషెడ్యూల్‌ను పరీక్షల నియంత్రణ ఆచార్య రాజేందర్ కట్ల ప్రకటించారు. ఎం.సి.ఎ. మొదటి పేపర్ మార్చి 6న, రెండవ పేపర్ మార్చి 9న, మూడవ పేపర్ మార్చి 11న, నాల్గవ పేపర్ మార్చి 13న, ఐదవ పేపర్ పరీక్ష మార్చి 17న నిర్వహించనున్నారు. ముందగా ప్రకటించిన సెంటర్లలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య పరీక్షలు జరగనున్నాయని పేర్కొన్నారు.

.

News February 24, 2026

పెద్దపల్లి: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై కలెక్టర్ సమీక్ష

image

కలెక్టర్ శ్రీహర్ష మంగళవారం సంబంధిత అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణాలలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్‌పై అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో మార్చి 5 నాటికి బేస్మెంట్ స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం అందించాలని ఆదేశించారు.