News March 3, 2025
కొత్తగూడెం: పీడీఎస్యూ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

నేడు ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థ ప్రైవేటుపరం చేసి కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు అన్నారు. కొత్తగూడెం కార్యాలయంలో సోమవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శ్యామ్, ప్రధాన కార్యదర్శిగా ప్రణయ్ కుమార్, ఉపాధ్యక్షుడిగా రాజేశ్, సహాయ కార్యదర్శిగా వెంకటేశ్, కోశాధికారిగా భాస్కర్తో పాటు 11 మంది కమిటీని ఎన్నుకున్నామని తెలిపారు.
Similar News
News March 4, 2025
బ్లూఫ్లాగ్ రద్దు.. ఇద్దరు అధికారులపై వేటు

AP: విశాఖ రుషికొండ బీచ్కు బ్లూఫ్లాగ్ హోదా <<15639382>>గుర్తింపు <<>>రద్దుకు బాధ్యుల్ని చేస్తూ ఇద్దరు అధికారులపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. విశాఖ జిల్లా పర్యాటక శాఖ అధికారి జ్ఞానవేణి, RJD రమణను తప్పించింది. బీచ్పై వచ్చిన అభ్యంతరాలపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బీచ్ పరిశుభ్రతపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. బీచ్ పరిశుభ్రతపై పర్యాటకులకు అవగాహన కల్పిస్తోంది.
News March 4, 2025
ట్రంప్తో ట్రూడో ఢీ: ప్రతీకార టారిఫ్స్ ప్రకటన

అమెరికాపై కెనడా ప్రతీకార సుంకాలను ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్ తగ్గేవరకు తామూ తగ్గమని PM జస్టిన్ ట్రూడో అన్నారు. ‘ఈ అన్యాయానికి కెనడా బదులివ్వకుండా ఉండదు. తొలి దశలో $20.6B US ఉత్పత్తులపై మేమూ 25% టారిఫ్స్ వేస్తాం. 3 వారాల్లోపు రెండో దశలో మరో $80Bకు విస్తరిస్తాం’ అని ట్రూడో తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే రెండేళ్లలోనే కెనడా ప్రొడక్షన్ 3% మేర తగ్గుతుందని బ్యాంక్ ఆఫ్ కెనడా ఆందోళన వ్యక్తం చేసింది.
News March 4, 2025
NLG: ఆన్లైన్లో ఇంటర్ హాల్ టికెట్లు

ఇంటర్ విద్యార్థులు ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావొచ్చని జిల్లా ఇంటర్ విద్యా అధికారి దస్రునాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో తీసుకున్న హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకుండానే పరీక్షలు రాయవచ్చని తెలిపారు. కళాశాలల యాజమాన్యాలు హాల్ టికెట్ల మంజూరులో జాప్యం చేసినా, కేంద్రాల్లో సమస్యలు ఉన్నా డీఐఈవో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.