News February 18, 2025
కొత్తగూడెం: ప్రతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించండి: కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.
Similar News
News December 4, 2025
6న అంబాజీపేటలో ఉమ్మడి తూ.గో. అండర్-17 క్రికెట్ జట్టు ఎంపిక

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్-17 బాలుర క్రికెట్ జట్టును ఈ నెల 6న అంబాజీపేట జడ్పీహెచ్ స్కూల్లో ఎంపిక చేయనున్నట్లు డీఈవో షేక్ సలీం బాషా తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఉదయం 9 గంటలలోపు హైస్కూల్కు చేరుకుని వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. వివరాల కోసం ఎస్జీఎఫ్ కార్యదర్శులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
News December 4, 2025
కరీంనగర్: పంచాయతీ ఎన్నికల్లో మాజీ ఎంపీపీలు

పంచాయతీ ఎన్నికలలో సీనియర్ నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ ఇన్ఛార్జ్ ఛైర్మన్గా, వైస్ ఛైర్మన్గా, వేములవాడ ఎంపీపీగా పనిచేసిన తీగల రవీందర్ గౌడ్ హనుమాజీపేట సర్పంచ్గా బరిలో నిలిచారు. చందుర్తి మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య చందుర్తి సర్పంచ్గా, వేములవాడ మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్ వట్టెంల సర్పంచ్గా పోటీలో నిలవడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
News December 4, 2025
నాగిరెడ్డిపేట: MPDO, MPO సస్పెండ్

నాగిరెడ్డిపేట MPDO లలిత కుమారి, MPO ప్రభాకర్ చారీలను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సస్పెండ్ చేశారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించడం, సమయానుగుణంగా అధికారులకు వివరాలను అందించడంలో అలసత్వంగా వ్యవహరించడంతో జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా తమ ఇష్టానుసారంగా వెళ్లడంతో వేటు వేసింది. పంచాయతీ ఎన్నికలను అధికారులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.


