News April 12, 2025
కొత్తగూడెం: ‘యువ వికాసం అప్లికేషన్లు అందజేయండి’

జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయాల్లో నేటి నుంచి 3 రోజులు వరకు రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్ పత్రాలు అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తులు స్వీకరించే అధికారులు, సిబ్బంది రెండో శనివారం, ఆదివారం, సోమవారం అందుబాటులో ఉంటారని తెలిపారు. కాగా సాంకేతిక కారణాల వల్ల చాలామంది దరఖాస్తు చేసుకోలేదని మరికొంత సమయం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News November 18, 2025
NRPT: పొగమంచుతో వాహనదారులు జాగ్రత్త: ఎస్పీ

చలికాలం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు ఉంటుందని వాహనదారులు జాగ్రత్తగా నడపాలని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించవని, వాహనాలు నెమ్మదిగా నడపాలని సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం చేసిన, అజాగ్రత్తగా ఉన్న పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు చెప్పారు. హెడ్ లైట్లను బీమ్లో ఉంచి ఫాగ్ లైట్లు వాడాలని సూచించారు. ఏకాగ్రతతో వాహనాలు నడిపించాలని చెప్పారు.
News November 18, 2025
ఇతిహాసాలు క్విజ్ – 70 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: హనుమంతుడిని ‘మారుతీ’ అని ఎందుకు పిలుస్తారు?
సమాధానం: మారుత్ అంటే సంస్కృతంలో వాయువు అని అర్థం. ఆ వాయు దేవుడి పుత్రుడు కాబట్టే ఆంజనేయ స్వామిని మారుతి అని అంటారు. హనుమంతుడు వాయు శక్తి, వేగాన్ని కలిగి ఉంటాడు. ఆయన ఆకాశంలో పయనించేటప్పుడు, ఆయన వేగం, శక్తి వాయువుతో సమానం. అలా వాయు శక్తిని తనలో నిక్షిప్తం చేసుకున్న దివ్య స్వరూపుడిగా ఆయన్ను మారుతిగా కీర్తిస్తారు. <<-se>>#Ithihasaluquiz<<>>
News November 18, 2025
ములుగు: మావోయిస్టులకు సేఫ్ జోన్గా తెలంగాణ?

మోస్ట్ వాంటెడ్, సీసీ కమిటీ మెంబర్ మడవి హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఛత్తీస్గఢ్లో వేల సంఖ్యలో జవాన్లు అడవుల్లో జల్లడ పడుతుండడం, వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు దళాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అయితే తెలంగాణలో ప్రస్తుతం కాల్పుల విరమన ఉండటంతో మావోయిస్టులకు సేఫ్ జోన్ కానుందని తెలుస్తోంది. కాగా మావోయిస్టులు సైతం తెలంగాణలో మరో 6 నెలల పాటు సీజ్ ఫైర్ ప్రకటించిన విషయం తెలిసిందే.


