News September 14, 2024

కొత్తగూడెం: రూ.మూడు లక్షలతో గణేషుడికి అలంకరణ

image

గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నపురెడ్డిపల్లిలోని గణేశ్ విగ్రహానికి భక్తుల నుంచి సేకరించిన మూడు లక్షల రూపాయలతో అలంకరణలు చేశారు. లక్ష్మీ గణపతి అవతారంలో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం లక్ష్మీ గణపతి విశిష్టతను పూజారి భక్తులకు తెలిపారు. ఉత్సవ కమిటీ పర్యవేక్షణలో పూజలు నిర్వహించారు.

Similar News

News November 14, 2025

ఖమ్మంలో దడ పుట్టిస్తున్న చలి

image

ఖమ్మం జిల్లాలో గత నాలుగు రోజులుగా వీస్తున్న చలిగాలుల తీవ్రతతో కనిష్ట ఉష్ణోగ్రతలు అసాధారణంగా పడిపోయాయి. ఈ చలికి హాస్టల్ విద్యార్థులు, వృద్ధులు వణికిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో వైరల్ న్యుమోనియా వ్యాప్తి చెందుతుండటంతో పిల్లలు, వృద్ధులు ఆసుపత్రులకు వెళ్తున్నారు. శ్వాసకోశ ఇబ్బందులను నిర్లక్ష్యం చేయవద్దని, చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య అధికారులు ప్రజలకు సూచించారు.

News November 14, 2025

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న డయాబెటిస్ బాధితులు

image

ఖమ్మం జిల్లాలో డయాబెటిస్ బాధితులు సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. జిల్లాలో 13,35,202 జనాభా ఉన్నారు. వీరిలో మధుమేహం లక్షణాలు ఉన్నవారు 55,829, అధిక రక్తపోటు ఉన్నవారు 77,604 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1.30 లక్షల మందిని ఎన్సీడీ పోర్టల్‌లో నమోదు చేసి వారికి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేల్లో జిల్లా మధుమేహ వ్యాప్తిలో 10వ జాబితాలో చేరింది. ‘నేడు వరల్డ్ డయాబెటిస్ డే’

News November 14, 2025

ఖమ్మం: మా పిల్లలు మంచిగా చదువుతున్నారా..?

image

ఖమ్మం జిల్లాలోని నేడు అన్ని పాఠశాలల్లో పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 1,217ప్రభుత్వ పాఠశాలలు,14 కేజీబీవీలు, రెండు మోడల్ స్కూల్స్ ఉన్నాయి. సుమారు 66వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. సమావేశాలకు హజరయ్యే పేరెంట్స్‌కి స్కూల్లో బోధన, విద్యార్థుల పట్ల ఎలా మెలగాలి, వారిని ఎలా ప్రోత్సాహించాలనే అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అంశాల వారీగా 40నిమిషాల పాటు సమావేశం నిర్వహించనున్నారు.