News March 5, 2025

కొత్తగూడెం: రూ.10.30లక్షల గంజాయి పట్టివేత

image

భద్రాచలం పట్టణంలోని ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద మంగళవారం టౌన్‌ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో 2 ద్విచక్ర వాహనాలపై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద రూ.10.30 లక్షలు విలువ గల 20 కేజీల గంజాయి పట్టుబడింది. గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా భద్రాచలంలో పట్టుకున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. వీరంతా సుక్మా జిల్లాకు చెందిన వారిగా విచారణలో తేలిందని ఎస్ఐ పేర్కొన్నారు.

Similar News

News March 6, 2025

రిటైర్మెంట్‌పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

image

AP: ఒక్కసారిగా రిటైర్మెంట్ జీవితంలోకి మారినా దగ్గుబాటి హ్యాపీగా ఉన్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. తనకూ ఆ పరిస్థితి వస్తే సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఎలా సమయం వెచ్చిస్తున్నారని ఆయనను అడిగానన్నారు. ‘ఉదయాన్నే బ్యాడ్మింటన్, తర్వాత మనవళ్లు, మనవరాళ్లతో ఆటలు, స్నేహితులతో మాటలు, పేకాట, రాత్రి పిల్లలకు కథలు చెప్పి సంతోషంగా నిద్రపోతా అని దగ్గుబాటి చెప్పారు. ఇదో వండర్‌ఫుల్ లైఫ్’ అని పేర్కొన్నారు.

News March 6, 2025

వికారాబాద్: ద్వితీయ సంవత్సరం పరీక్షకు 6, 963 మంది విద్యార్థులు

image

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మొదటి పరీక్షకు 6,963 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు జిల్లా ఇంటర్ బోర్డు నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. గురువారం ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా ద్వితీయ సంవత్సరం లాంగ్వేజెస్ తెలుగు, సంస్కృతం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 29 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

News March 6, 2025

నారా భువనేశ్వరికి స్వాగ‌తం ప‌లికిన ఎంపీ కేశినేని దంప‌తులు

image

విజ‌య‌వాడ‌లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణం చేప‌ట్ట‌డం సంతోషంగా ఉంద‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. విజయవాడ టీచర్స్ కాలనీలో గురువారం జ‌రిగిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భ‌వ‌న్ నిర్మాణ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో ఎంపీ కేశినేని దంప‌తులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి శంకుస్థాప‌న చేసేందుకు విచ్చేసిన నారా భువనేశ్వరికి కేశినేని దంపతులు ఘన స్వాగతం పలికారు. 

error: Content is protected !!