News March 1, 2025

కొత్తగూడెం: ‘వారి ప్రాణత్యాగాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ’

image

ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అమరులైన మాదిగ ఉద్యమ నాయకులను స్మరించుకుంటూ శనివారం కొత్తగూడెం పట్టణ కేంద్రంలో వారికి పూలతో ఘన నివాళులు అర్పించారు. అమరులైన వారి ప్రాణ త్యాగాల ఫలితంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నామని తెలంగాణ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు సలిగంటి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో సుమంత్, పవన్, శ్రీనివాస్, అజయ్, చరణ్, చందు, సాయికుమార్, కిషోర్, అనిల్, భరత్, రాకేశ్ పాల్గొన్నారు.

Similar News

News March 3, 2025

SEBI మాజీ చీఫ్, BSE అధికారులకు స్వల్ప ఊరట

image

మార్కెట్ అవకతవకలు, కార్పొరేట్ మోసం కేసులో SEBI, BSE అధికారులపై ACB FIR ఫైల్ చేయాలన్న ముంబై సెషన్స్ కోర్టు ఆదేశాలను బాంబే హైకోర్టు నిలిపివేసింది. ముందస్తుగా నోటీసులు ఇవ్వకపోవడంతో సెషన్స్ కోర్టు ఆదేశాలు చెల్లుబాటు కావన్న రెస్పాండెంట్స్‌ లాయర్ల వాదనను అంగీకరించింది. TUE వాదనలు వింటామంది. సెబీ మాజీ చీఫ్ మాధబీ, మెంబర్లు అశ్వనీ, అనంత్, కమలేశ్, BSE ఛైర్మన్ ప్రమోద్, CEO సుందర రామన్‌కు ఊరటనిచ్చింది.

News March 3, 2025

టెన్త్ హాల్ టికెట్లు విడుదల

image

AP: పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. https://bse.ap.gov.in/ వెబ్‌సైట్ నుంచి <>డౌన్‌లోడ్<<>> చేసుకోవచ్చని సూచించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వాట్సాప్ (9552300009) సర్వీస్ ‘మన మిత్ర’లోనూ అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అందులో ఎడ్యుకేషన్ సర్వీసెస్ సెలక్ట్ చేసుకుని అప్లికేషన్ నంబర్/DOB ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది.

News March 3, 2025

చిత్తూరు: ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 609 మంది గైర్హాజరు

image

చిత్తూరు జిల్లాలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు DIEO సయ్యద్ మౌలా తెలిపారు. తొలి రోజు సోమవారం తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ పరీక్షలకు మొత్తం 12,220 మందికి గాను 11,711 మంది విద్యార్థులు హాజరుకాగా, 509 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్టు తెలిపారు. ఒకేషనల్ పరీక్షకు 1,809 మందికి గాను 1,709 మంది విద్యార్థులు హాజరు కాగా, 100 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు తెలిపారు.

error: Content is protected !!