News March 4, 2025
కొత్తగూడెం: విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలి: కలెక్టర్

రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలను ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 9255 మంది విద్యార్థులు మరియు రెండవ సంవత్సరంలో 10003 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 28, 2025
HYD: పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్కు విశేష స్పందన

హైటెక్స్లో 3 రోజులపాటు జరిగిన పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్కు దేశ విదేశాల నుంచి యాభై వేల మందికి పైగా సందర్శకులు హాజరై విశేష స్పందన లభించిందని తెలిపారు. పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పౌల్ట్రీ రంగానికి అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. ముగింపు కార్యక్రమానికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. కోడిగుడ్ల ఉత్పత్తిలో 2 స్థానంలో ఉండడం సంతోషం అన్నారు.
News November 28, 2025
డిసెంబర్ పెన్షన్లకు రూ.2,739 కోట్లు విడుదల

AP: సీఎం చంద్రబాబు డిసెంబర్ 1న ఏలూరు జిల్లా గోపాలపురంలో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. DEC పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.2,738.71 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 63,25,999 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ నెలలో నూతనంగా 8,190 పెన్షన్లు మంజూరు చేశామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పెన్షన్ల రూపంలో రూ.21,280 కోట్లు అందజేశామని వివరించారు.
News November 28, 2025
వాషింగ్ మెషీన్.. ఈ జాగ్రత్తలు తెలుసా?

నిన్న HYDలో వాషింగ్ మెషీన్ <<18404735>>పేలడంతో<<>> చాలా మంది భయపడుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలతో ప్రమాదాలు నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. *రెగ్యులర్గా ఫిల్టర్ క్లీన్ చేసుకోవడంతో పాటు సర్వీసింగ్ చేయించాలి *టూల్స్ మార్చాల్సి వస్తే బ్రాండెడ్వే వాడాలి *ఎక్కువ లోడ్ (దుస్తులు) వేయొద్దు. దీన్ని వల్ల ఒత్తిడి పెరుగుతుంది *ఏదైనా పెద్ద శబ్దం, వాసన వస్తే వెంటనే ప్లగ్ తీసి టెక్నీషియన్ను పిలవాలి.


