News July 10, 2024
కొత్తగూడెం: ‘సింగరేణిపై కేంద్రం కుట్రలను ఉద్యమాల ద్వారా తిప్పికొట్టాలి’
చట్టసభలో ఉన్న మందబలంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటుందని కొత్తగూడెం శాసనసభ సభ్యుడు, సింగరేణి గుర్తింపు సంఘం గౌరవ అధ్యక్షుడు,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. చట్టాలను తీసుకొస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేటుకు ధారాదత్తం చేస్తోందని అన్నారు. అందులో భాగంగానే తెలంగాణలోని సింగరేణి సంస్థను దశలవారీగా నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు.
Similar News
News October 8, 2024
పాలేరు నియోజకవర్గ అభివృద్ధిపై కామెంట్ చేయండి?
KMM జిల్లాలో పాలేరు నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ నుంచి హేమాహేమీలు ఎమ్మెల్యేలుగా గెలుపొంది తర్వాత రాష్ట్ర స్థాయిలో పేరొందారు. 1999,2004లో సంబాని చంద్రశేఖర్, 2009,2014లో రాంరెడ్డి వెంకటరెడ్డి, ఆయన మృతితో వచ్చిన బైఎలక్షన్లో తుమ్మల నాగేశ్వరరావు, 2018లో కందాల ఉపేందర్ రెడ్డి, 2024లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. కాగా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎవరు బెస్టో కామెంట్ చేయండి.
News October 8, 2024
ఖమ్మం: అధికారుల తీరుపై కలెక్టర్ సీరియస్
ఖమ్మం జిల్లా అధికారులపై కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఫైర్ అయ్యారు. గ్రీవెన్స్ డేలో ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన విజ్జుదేవి ఉద్యోగానికి కుల సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకుంది. సమయానికి తహశీల్దార్ స్వామి మంజూరు చేయకపోవడంతో ఆమె ఉద్యోగం కోల్పోయింది. ఈవిషయాన్ని ఆమె కలెక్టర్ దృష్టికి తేగా ప్రజాసమస్యలు పరిష్కారించడానికి ఉన్నారా.. సమస్యలు సృష్టించడానికి ఉన్నారా అంటూ తహశీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
News October 8, 2024
చెన్నారంలో శిశువు మృతదేహం కలకలం
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెన్నారం గ్రామంలో శిశువు మృతదేహం కలకలం రేపింది. గ్రామంలో ఓ వ్యక్తి ఇంటి ఎదుట మంగళవారం తెల్లవారుజామున శిశువు మృతదేహం పడేసి ఉంది. ఈ ఘటన గ్రామంలో చర్చనీయంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహన్ని ఎవరైనా తీసుకొచ్చి పడేశారా లేదా కుక్కలు లాక్కొచ్చాయా అనే కోణంలో విచారిస్తున్నారు.