News August 18, 2024
కొత్తగూడెం: సింగరేణి కార్పొరేట్ సేఫ్టీ జీఎంగా శ్రీనివాస్

సింగరేణి సంస్థ కార్పొరేట్ సేఫ్టీ జీఎంగా చింతల శ్రీనివాస్ శనివారం బాధ్యతలు చేపట్టారు. గతంలో జీఎంగా ఉన్న గురువయ్య జూలై 31న ఉద్యోగ విరమణ చేయగా ఆయన స్థానంలో ఆర్-1 జీఎంగా ఉన్న శ్రీనివాస్ను నియమించారు. ఈ సందర్భంగా విధుల్లో చేరిన ఆయన మాట్లాడుతూ.. విలువైన కార్మికుల ప్రాణాలను కాపాడేలా ప్రమాదాల సంఖ్య తగ్గింపునకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే, స్వీయరక్షణపై అందరూ దృష్టి సారించాలన్నారు.
Similar News
News November 18, 2025
ఖమ్మం: సీతారామ పథకానికి అత్యధిక పరిహారం: అ. కలెక్టర్

సీతారామ ఎత్తిపోతల పథకం భూసేకరణపై సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి రైతులతో చర్చించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం బాజుమల్లాయిగూడెం రైతులకు ఎకరాకు ₹11.44 లక్షలు, రేలకాయపల్లికి ₹12.40 లక్షలు చెల్లించాలని నిర్ణయించారు. భూముల ధరలు వార్షికంగా పెరిగే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, బాజుమల్లాయిగూడెం రైతులకు ₹15 లక్షలు, రేలకాయపల్లి రైతులకు ₹16 లక్షల పరిహారం అందిస్తామని ఆయన తెలిపారు.
News November 18, 2025
ఖమ్మం: సీతారామ పథకానికి అత్యధిక పరిహారం: అ. కలెక్టర్

సీతారామ ఎత్తిపోతల పథకం భూసేకరణపై సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి రైతులతో చర్చించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం బాజుమల్లాయిగూడెం రైతులకు ఎకరాకు ₹11.44 లక్షలు, రేలకాయపల్లికి ₹12.40 లక్షలు చెల్లించాలని నిర్ణయించారు. భూముల ధరలు వార్షికంగా పెరిగే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, బాజుమల్లాయిగూడెం రైతులకు ₹15 లక్షలు, రేలకాయపల్లి రైతులకు ₹16 లక్షల పరిహారం అందిస్తామని ఆయన తెలిపారు.
News November 18, 2025
‘ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై అధికారులు దృష్టి సారించాలి’

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై మండల ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. మండల ప్రత్యేక అధికారులు ప్రతి శుక్రవారం చేపట్టిన తనిఖీలకు సంబంధించిన అంశాలపై ఆమె మరో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డితో కలిసి సమీక్షించారు.


