News April 10, 2025
కొత్తగూడెం: ‘200 ఎకరాల వ్యవసాయ భూమి కబ్జా’

కొత్తగూడెం(D) టేకులపల్లి(M) గంగారం రెవెన్యూ పరిధి సంపత్ నగర్లో కొందరు 200 ఎకరాల సాగు భూములకు నకిలీ పత్రాలు సృష్టించి కాజేయాలని చూస్తున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఓ మాజీ రౌడీ షీటర్, కేటీపీఎస్లో పని చేసే ఒక ఉద్యోగి, స్థానికుడు ఇదంతా నడిపిస్తున్నారంటున్నారు. గుడివాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నాన్ జ్యుడీషరీ స్టాంప్ పేపర్ సృష్టించారని, ఈ ఆధారాలతో ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.
Similar News
News November 12, 2025
జూబ్లీహిల్స్: ‘మనం గెలుస్తామా.. మెజార్టీ ఎంత..?’

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగియడంతో గెలుపు అవకాశాలపై కాంగ్రెస్, BRS, BJP నేతలు చర్చలు జరుపుతున్నారు. ‘షేక్పేట్, బోరబండ, యూసుఫ్గూడ, ఎర్రగడ్డ, రహమత్నగర్, వెంగళ్రావునగర్, సోమాజిగూడ డివిజన్లలో మన పార్టీకి ఎన్ని ఓట్లు పడి ఉంటాయి.. మనం గెలుస్తామా.. మెజార్టీ ఎంత వస్తుంది.. పోల్ మేనేజ్మెంట్ బాగా జరిగిందా’ అంటూ లోకల్ నేతలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. దీనిపై మీ కామెంట్?
News November 12, 2025
జూబ్లీహిల్స్: ‘మనం గెలుస్తామా.. మెజార్టీ ఎంత..?’

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగియడంతో గెలుపు అవకాశాలపై కాంగ్రెస్, BRS, BJP నేతలు చర్చలు జరుపుతున్నారు. ‘షేక్పేట్, బోరబండ, యూసుఫ్గూడ, ఎర్రగడ్డ, రహమత్నగర్, వెంగళ్రావునగర్, సోమాజిగూడ డివిజన్లలో మన పార్టీకి ఎన్ని ఓట్లు పడి ఉంటాయి.. మనం గెలుస్తామా.. మెజార్టీ ఎంత వస్తుంది.. పోల్ మేనేజ్మెంట్ బాగా జరిగిందా’ అంటూ లోకల్ నేతలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. దీనిపై మీ కామెంట్?
News November 12, 2025
దేశవాళీ ఆడాల్సిందే.. RO-KOకు బీసీసీఐ అల్టిమేటం?

కోహ్లీ, రోహిత్ వన్డే భవిష్యత్తుపై BCCI కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వారు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని, లేదంటే జట్టులో చోటు కష్టమేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తాను విజయ్ హజారే ట్రోఫీలో ఆడతానని హిట్మ్యాన్ MCAకు సమాచారం అందించినట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి. కోహ్లీ ఆడటంపై ఇంకా క్లారిటీ రాలేదు. T20, టెస్టులకు వీడ్కోలు పలికిన RO-KO వన్డేల్లో మాత్రం కొనసాగుతున్న విషయం తెలిసిందే.


