News January 23, 2025
కొత్తగూడెం: AAI అధికారుల పర్యటన

కొత్తగూడెంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కేంద్ర బృందం గురువారం పర్యటించింది. చుంచుపల్లి, సుజాతనగర్, పాల్వంచ మండలాలలో ఎయిర్ పోర్ట్ కోసం అనువైన స్థలాలను జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్తో పాటు కేంద్ర ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం పరిశీలిస్తోంది.
Similar News
News September 17, 2025
అనకాపల్లి: రాగల ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు

అనకాపల్లి జిల్లాలో రాబోయే ఐదు రోజులు మేఘావృత వాతావరణం నెలకొని తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్ఆర్ఎస్ వ్యవసాయ పరిశోధనా స్థానం అధికారి ముకుందరావు తెలిపారు. మంగళవారం జరిగిన వాతావరణ ఆధారిత వ్యవసాయ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News September 17, 2025
విహారయాత్రకు బయలుదేరిన జీవీఎంసీ కార్పొరేటర్లు

జీవీఎంసీ కార్పొరేటర్లు విహారయాత్రకు బయలుదేరారు. మొత్తం 83 మంది కార్పొరేటర్లు ఉండగా.. ఇందులో 43 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్తో పాటు జీవీఎంసీ సెక్రెటరీ, అధికారులు బయలుదేరిన వారిలో ఉన్నారు. తొమ్మిది రోజులు జరిగే ఈ అధ్యయన యాత్రలో జైపూర్, జోద్పూర్, ఢిల్లీ, తదితర ప్రాంతాల్లో కార్పొరేషన్ ప్రాజెక్టులను పరిశీలిస్తారు. 24న తిరిగి విశాఖ రానున్నట్లు అధికారులు తెలిపారు.
News September 17, 2025
సోషల్ మీడియా పోస్టుకి స్పందించిన DyCM పవన్ కళ్యాణ్

ట్విట్టర్(X)లో ఒక సామాన్యుడు పెట్టిన పోస్టుకు DyCM పవన్ కళ్యాణ్ స్పందించారు. గుంతలమయంగా మారిన ఏలేశ్వరం – అడ్డతీగల రోడ్డు దుస్థితిపై చైతన్య రాజు అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవన్ ఈ పోస్టుకు స్పందించి, తక్షణ మరమ్మతులకు ఆదేశాలు జారీ చేశారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.