News January 23, 2025

కొత్తగూడెం: AAI అధికారుల పర్యటన

image

కొత్తగూడెంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కేంద్ర బృందం గురువారం పర్యటించింది. చుంచుపల్లి, సుజాతనగర్, పాల్వంచ మండలాలలో ఎయిర్ పోర్ట్ కోసం అనువైన స్థలాలను జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్‌తో పాటు కేంద్ర ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం పరిశీలిస్తోంది. 

Similar News

News February 7, 2025

నల్గొండ: ఎమ్మెల్సీగా ఆర్వ స్వాతి నామినేషన్ దాఖలు

image

నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మహిళా అభ్యర్థిగా మాజీ సర్పంచ్ అర్వ స్వాతి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నిడమనూరు మండలం వేం పహాడ్ గ్రామ మాజీ సర్పంచ్‌గా ఆమె పని చేశారు. కాగా గతంలో ఉత్తమ గ్రామ అవార్డు పొందారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల పోరాడుతానని ఆమె హామీ ఇచ్చారు.

News February 7, 2025

కాళ్ల: స్థల వివాదమే హత్యకు కారణం

image

కాళ్ల మండలం పెదఅమిరం గ్రామంలో తమ్ముడిని అన్న హత్య చేసిన ఘటనకు స్థలం గొడవే కారణంగా తెలుస్తోంది. తమ తల్లికి చెందిన సెంటు స్థలం కోసం అన్న రమేశ్, తమ్ముడు సత్యనారాయణ మధ్య వివాదం నడుస్తోంది. 2023లో ఒకరిపై ఒకరు కేసు పెట్టుకుని రాజీ పడ్డారు. ఆ తర్వాత కూడా గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం సాయంత్రం అన్న ఇంటికి వెళ్లి రమేశ్ గొడవపడ్డాడు. సత్యనారాయణ తలపై బలంగా కొట్టడంతో రమేశ్ మృతి చెందాడు. కేసు నమోదైంది.

News February 7, 2025

ఇకపై లేఖర్ల అవసరం లేదు: డీఐజీ

image

ఆస్తి రిజిస్ట్రేషన్లకు ఇకనుంచి లేఖర్లు అవసరం లేదని రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ జి.బాలకృష్ణ తెలిపారు. గురువారం ఆయన మాడుగుల రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించారు. రిజిస్ట్రేషన్లు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరికి వారే రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చునని పేర్కొన్నారు. ఆస్తి కొనుగోలుదారులు చలానా తీసిన వెంటనే అన్ని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామన్నారు.

error: Content is protected !!