News March 8, 2025

కొత్తపల్లి: పేకాట శిబిరంపై పోలీసుల దాడి

image

కొత్తపల్లి మండల కేంద్రం శివారులో శుక్రవారం పేకాట శిబిరంపై దాడి చేసినట్లు ఎస్ఐ విజయ్ తెలిపారు. బెట్టింగ్ కాస్తూ కొంతమంది పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయమైన సమాచారం మేరకు దాడులు చేసి రూ. 45 వేల నగదు, ఐదు సెల్ ఫోన్లు, నాలుగు ద్విచక్రవాహనాలు సీజ్ చేసినట్లు చెప్పారు. పేకాట ఆడుతున్న ఏడుగురిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చెప్పారు.

Similar News

News September 17, 2025

ఒత్తైన జుట్టుకు బియ్యం నీళ్లు

image

ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్య పెరిగింది. అయితే హెయిర్‌లాస్ ఎక్కువ ఉంటే బియ్యం కడిగిన నీళ్లతో చెక్ పెట్టొచ్చు. బియ్యం నీటితో మర్దనా చేసుకుంటే మాడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే అమినో ఆమ్లాలు, విటమిన్‌ బీ, ఈ, సీలు జుట్టు పెరగడానికి సహకరిస్తాయి. అలాగే రాత్రి బియ్యం నానబెట్టిన నీటిని వడకట్టి ఉదయాన్నే తలకు పట్టించి అరగంట తర్వాత కడుక్కోవాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

News September 17, 2025

NGKL: తెలంగాణ సాయుధ పోరాటంలో అప్పంపల్లి కీలకం

image

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో MBNR జిల్లాలోని అప్పంపల్లి గ్రామం కీలక పాత్ర పోషించింది. ఈ గ్రామం నుంచి 11 మంది పోరాటంలో పాల్గొని అమరులయ్యారు. పోరాటంలో చాకలి కిష్టన్నను నిజాం పాలకులు మొదట చంపినా, లింగోజిరావు వంటి వీరులు వెనుకడుగు వేయకుండా నిజాంకు వ్యతిరేకంగా పోరాడి, తెలంగాణ విలీనానికి కృషి చేశారని చరిత్ర చెబుతోంది.

News September 17, 2025

VKB: పోరాట యోధుడు దొండేరావ్ జాదవ్

image

వికారాబాద్ గాంధీ కాలనీకి చెందిన దొండేరావ్ జాదవ్ నిజాం పాలనలో ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాలను వ్యతిరేకించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి 1947 SEP 17న అరెస్టయ్యారు. గుల్బర్గా జైలులో నిర్బంధం ఎదుర్కొన్నారు. 1948లో సర్దార్ పటేల్ సైనిక చర్యతో TG భారతదేశంలో విలీనమైంది. ఆయన విడుదలయ్యారు. త్యాగానికి గుర్తుగా ప్రభుత్వం తామ్రపత్రం ప్రదానం చేసింది. వికారాబాద్‌లో శిలాఫలకం ఏర్పాటు చేసింది.