News March 8, 2025
కొత్తపల్లి: పేకాట శిబిరంపై పోలీసుల దాడి

కొత్తపల్లి మండల కేంద్రం శివారులో శుక్రవారం పేకాట శిబిరంపై దాడి చేసినట్లు ఎస్ఐ విజయ్ తెలిపారు. బెట్టింగ్ కాస్తూ కొంతమంది పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయమైన సమాచారం మేరకు దాడులు చేసి రూ. 45 వేల నగదు, ఐదు సెల్ ఫోన్లు, నాలుగు ద్విచక్రవాహనాలు సీజ్ చేసినట్లు చెప్పారు. పేకాట ఆడుతున్న ఏడుగురిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చెప్పారు.
Similar News
News November 23, 2025
KRM: స్కాలర్షిప్ NMMS పరీక్షకి 77మంది గైర్హాజరు

కరీంనగర్ జిల్లాలో 7 పరీక్షా కేంద్రాలల్లో NMMS ఆదివారం 9:30 నుంచి12:30 నిర్వహించినట్లు జిల్లా విద్యాధికారి మొండయ్య తెలిపారు. పరీక్షకు 1,507 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1,430 మంది హాజరయ్యారని తెలిపారు. 7 పరీక్షా కేంద్రాలలో సిట్టింగ్ స్క్వాడ్లతో పాటు 02 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించబడినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలల్లో ఎలాంటి అవాంతరాలు కలుగలేదని జిల్లా విద్యాధికారి తెలిపారు.
News November 23, 2025
సైబరాబాద్: 424 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 424 కేసులను నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసు నమోదు చేశారు. 300 ద్విచక్ర వాహనాలు,18 త్రీ వీలర్స్, 99 ఫోర్ వీలర్స్, 7 హెవీ వెహికిల్స్ పైన కేసు నమోదైంది. ప్రతివారం ఈ తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.
News November 23, 2025
జిల్లాస్థాయి చెకుముఖి పోటీల్లో గర్భాం ఏపీ మోడల్ విద్యార్థులు

విజయనగరం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి చెకుముఖి పోటీలు జరిగాయి. గర్భాం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. వచ్చె నెల 12,13,14 తేదీల్లో కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో సైన్స్ ఎక్స్పో లో పాల్గొంటారని ప్రిన్సిపల్ అరుణ తెలిపారు. విద్యార్థులకు జనవిజ్ఞాన వేదిక మెరకముడిదాం మండల శాఖ ఇన్ఛార్జి ఎం.రఘునాథరాజు, నవీన్ అభినందించారు.


