News April 10, 2025
కొత్తపల్లి: బెట్టింగ్లో నష్టం రావడంతో యువకుడి ఆత్మహత్యాయత్నం

బెట్టింగ్ యాప్లో నష్టం రావడంతో యూ.కొత్తపల్లి(M) రామన్నపాలెంలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన సూరిబాబు ఓ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలని గేమ్ ఆడి రూ.కోటి 50లక్షలు పోగొట్టుకున్నాడు. అప్పులవడంతో మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేయగా కుటుంబీకులు కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
Similar News
News November 28, 2025
పాడేరు: సచివాలయాల పర్యవేక్షణకు డిప్యూటీ ఎంపీడీవోల నియామకం

జిల్లాలో గ్రామ సచివాలయాల పర్యవేక్షణకు డిప్యూటీ ఎంపీడీవోలను నియమిస్తూ కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. జిల్లాలో 22మండలాలకు 22మంది అధికారులను నియమించారు. వీరు డిశంబర్ 1నుంచి నుంచి విధుల్లోకి రానున్నారు. సచివాలయాలను పర్యవేక్షణ చేయనున్నారు. పాడేరు మండలానికి రామకృష్ణ, అరకు ప్రసాద్, చింతపల్లి మూర్తి, రంపచోడవరం గిరిబాబు, కొయ్యూరు మండలానికి శ్రీనివాసరావు తదితరులు నియమితులయ్యారు.
News November 28, 2025
కడప: రైతు కంట నీరు.. నష్టం నమోదుకు అడ్డంకులు

జిల్లాలో నాలుగు రోజుల కింట కురిసిన వర్షాలకు వరి పంట పూర్తిగా దెబ్బతిందని రైతులు అంటున్నారు. చేలల్లోనే ధాన్యం తడిసి మొలకెత్తుతుండటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టాన్ని అధికారులు నమోదు చేయడం లేదని వాపోతున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు నమోదు చేసేందుకు ప్రభుత్వం ఇంకా తమకు లాగిన్ ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారంటున్నారు. ప్రభుత్వం స్పందించి నష్ట పరిహారాన్ని అందించాలని కోరుతున్నారు.
News November 28, 2025
ASF: లోకల్ ఎలక్షన్స్.. అభ్యర్థుల వేట

ఆసిఫాబాద్ జిల్లాలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు ముమ్మరం చేశాయి. ఆర్థిక బలం, ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న నాయకులను రంగంలోకి దించాలని ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. పార్టీ గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలు అయినప్పటికీ, గ్రామాల్లో తమ పట్టును నిలుపుకోవడానికి పంచాయతీ పాలకవర్గం కీలకంగా మారనుంది.


