News April 8, 2025
కొత్తపల్లి: హత్య కేసులో నేరస్థుడికి జైలు శిక్ష

హత్యకేసులో నిందితుడికి యావజ్జీవజైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పుఇచ్చిందని ఎస్పీ యోగేశ్గౌతమ్ తెలిపారు. ఆయన వివరాలు.. వింజమూరుకు చెందిన జోగువెంకట్ రాములు కొత్తపల్లి మం. తిమ్మారెడ్డిపల్లికి చెందిన కృష్ణవేణిని అత్యాచారం విఫలయత్నంచేసి నిప్పంటించి హత్యచేశాడు. ఈకేసులో ముద్దాయికి సోమవారం జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ శిక్ష విధించారు. 2022 ఫిబ్రవరి 15న బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామన్నారు.
Similar News
News September 17, 2025
చిత్తూరు జిల్లా పర్యాటక అధికారిగా నరేంద్ర

చిత్తూరులోని సావిత్రమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ లెక్చరర్ ఏఎం నరేంద్రకు కీలక పదవి లభించింది. ఆయనను పర్యాటక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. టూరిజం రంగంపై నరేంద్ర ఇప్పటివరకు అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని అనేక శాస్త్రీయ పత్రాలను ప్రచురించారు. విద్యారంగంలో విశేష అనుభవంతో పాటు సామాజిక రంగంలోనూ ఆయనకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నియమించింది.
News September 17, 2025
చాకలి ఐలమ్మ స్ఫూర్తి యోధులు వీరే..!

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మరికొందరు పోరాట యోధులు ఆమె పోరాట శైలిని స్ఫూర్తిగా తీసుకొని సాయుధ పోరాటంలో ఉద్యమించి ప్రాణాలర్పించారు. వారే పాలకుర్తికి చెందిన జీడి సోమయ్య, చాకలి సోమయ్య, మామిండ్ల ఐలయ్య, ఆకుల వెంకటయ్య, కమ్మరి బ్రహ్మయ్య, చుక్కా సోమయ్య, జీడి బాలయ్య, జీడి కొమురయ్య, వీరమనేని రామచంద్రయ్య తదితరులు ఉన్నారు.
News September 17, 2025
దేశవ్యాప్తంగా 16చోట్ల NIA సోదాలు

AP: విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో NIA మరోసారి తనిఖీలు చేపట్టింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, UP, ఝార్ఖండ్, బిహార్, ఢిల్లీ, మహారాష్ట్రలో మొత్తం 16చోట్ల సోదాలు చేసింది. ఏపీలో నిర్వహించిన సోదాల్లో డిజిటల్ పరికరాలు, నగదు, అనుమానాస్పద వస్తువులు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకుంది. జులై నెల VZMలో సిరాజ్ ఉర్ రెహ్మాన్ను NIA అరెస్టు చేయగా.. కేంద్రానికి వ్యతిరేకంగా కుట్ర పన్నినట్లు విచారణలో ఒప్పుకున్నాడు.