News April 8, 2025
కొత్తపల్లి: హత్య కేసులో నేరస్థుడికి జైలు శిక్ష

హత్యకేసులో నిందితుడికి యావజ్జీవజైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పుఇచ్చిందని ఎస్పీ యోగేశ్గౌతమ్ తెలిపారు. ఆయన వివరాలు.. వింజమూరుకు చెందిన జోగువెంకట్ రాములు కొత్తపల్లి మం. తిమ్మారెడ్డిపల్లికి చెందిన కృష్ణవేణిని అత్యాచారం విఫలయత్నంచేసి నిప్పంటించి హత్యచేశాడు. ఈకేసులో ముద్దాయికి సోమవారం జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ శిక్ష విధించారు. 2022 ఫిబ్రవరి 15న బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామన్నారు.
Similar News
News October 21, 2025
HYD: సదర్.. దున్నరాజుకు రూ.31 వేల మద్యం

ముషీరాబాద్లో సదర్ ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో కేరళ నుంచి తెచ్చిన 2,500 కిలోల ‘దున్నరాజు’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉత్సవంలో యాదవులు రూ.31,000 విలువైన ‘రాయల్ సెల్యూట్’ బాటిల్ను దున్నరాజుకు తాగించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నగరంలో సదర్ ఉత్సవాలు మరింత ఉత్సాహంగా జరుగుతున్నాయి.
News October 21, 2025
‘కడప సింహం’ ఉమేశ్ చంద్ర IPS.!

నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఈ నేపథ్యంలో పలువురు పోలీసు అమరవీరులను స్మరించుకోవాల్సిందే. ఈ కోవకు చెందినవారే ఉమేశ్ చంద్ర IPS. 1994 అక్టోబరులో మొదటిగా పులివెందులలో పనిచేశారు. 1995 జూన్లో కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్గా పదోన్నతి పొందారు. ఆ సమయంలో కడప SPగా ఫ్యాక్షన్ను కట్టడి చేసి ‘కడప సింహం’గా ఖ్యాతి గడించారు. అయితే 1999 SEP 4న HYD SRనగర్లో నక్సలైట్ల దాడిలో కన్నుమూశారు.
News October 21, 2025
టీషర్టులపై ఆధార్ కార్డుల ప్రింటింగ్.. ఎందుకంటే?

నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్డ్రగ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా మత్స్యకారులు పోరాటం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. రాజయ్యపేట వెళ్లే అన్ని దారుల్లో చెక్పోస్ట్లు ఏర్పాటు చేశారు. గ్రామానికి వెళ్లేవారిని ఆధార్ కార్డులు చూపించమని అడుగుతున్నారు. దీంతో మత్స్యకారులు టీషర్ట్లపై ఆధార్ కార్డు, బల్క్డ్రగ్ వ్యతిరేక పోరాటం స్లోగన్ ప్రింట్ చేయించుకుని అవి వేసుకుని తిరుగుతున్నారు.