News March 21, 2024

కొత్తపేట:3 సార్లు గెలుపు 3 సార్లు ఓటమి.. ఈసారి గెలుస్తారా?

image

కొత్తపేట నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు 1994 నుంచి ఇంతవరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా 3 సార్లు గెలిచి, 3 సార్లు ఓటమి చెందారు. టీడీపీ తరఫున (1994,1999), 2009లో ప్రజారాజ్యం తరఫున గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కొన్నాళ్ళు ఆ పార్టీలో కొనసాగి తిరిగి టీడీపీలో చేరారు. గత రెండు ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయన ఈసారి గెలుస్తారా?కామెంట్ చేయండి.

Similar News

News April 16, 2025

వైజాగ్‌లో ముక్కామలకు చెందిన యువకుడి మృతి

image

వైజాగ్‌లోని దివీస్‌లో పనిచేస్తున్న పెరవలి మండలం ముక్కామలకు చెందిన మధు మోహన్ మంగళవారం మృతి చెందాడు. మోహన్ దివీస్‌లో పనిచేస్తూ హాస్టల్లో ఉంటున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని హాస్టల్‌కి వచ్చాడు. అనంతరం ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భీమిలి పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

News April 16, 2025

రాజమండ్రి: నేటి నుంచి మోగనున్న పెళ్లి బాజాలు

image

నేటి నుంచి జిల్లాలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ వేసవిలో వేల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. బుధవారం నుంచి జూన్ 8 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. మళ్లీ జూన్ 11 నుంచి జూలై 12వరకు ముహూర్తాలు లేవు. జూలై 25 నుంచి శ్రావణమాసంలో శుభ ఘడియలు ఉండటంతో ముహూర్తాలు ఉండనున్నాయి. ఇక ఏప్రిల్, మే, జూన్ నెలల్లో శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో తెలుగింట వివాహ వేడుకలకు అంతా సిద్ధం అవుతున్నారు.

News April 16, 2025

తెలంగాణలో చనిపోయిన ముగ్గురు జిల్లా వాసులు వీరే..

image

తెలంగాణలో జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ శివారు జాతీయ రహదారి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో AMP (M) సవరప్పాలేనికి చెందిన ఒకే కుటుంబసభ్యులు ముగ్గురు మృతి చెందారు. సత్తి శ్రీను, భార్య రమణకుమారి, కుమార్తె అనూష చనిపోయారు. వీరి మృతదేహాలకు జనగామ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి బుధవారం సొంత గ్రామానికి తీసుకురానున్నట్లు బంధువులు తెలిపారు. వారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!