News April 16, 2025

కొత్త ఆర్ఓఆర్ చట్టాలపై అవగాహన కల్పించాలి: VKB కలెక్టర్

image

భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ రెవెన్యూ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో కొత్త ఆర్ఓఆర్ చట్టంపై తహశీల్దార్‌లతో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లింగ్యా నాయక్, ఆర్డీఓ వాసు చంద్రతో కలిసి సమీక్ష నిర్వహించారు.  

Similar News

News April 23, 2025

10th RESULTS: హ్యాట్రిక్ కొట్టిన పార్వతీపురం మన్యం జిల్లా

image

పదో తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా హ్యాట్రిక్ కొట్టింది. వరుసగా మూడోసారి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలించింది.
➤ 2022-23 విద్యా సంవత్సరంలో 10,694 మంది పరీక్ష రాయగా 9,356(87.4%) మంది పాసయ్యారు
➤ 2023-24 విద్యా సంవత్సంలో 10,443 మంది పరీక్షకు హాజరవ్వగా 10,064(96.37%) మంది ఉత్తీర్ణత సాధించారు
➤ ఈఏడాది(2024-25) 10,286 మంది పరీక్ష రాయగా 9,659 (93.90%) మంది పాసయ్యారు.

News April 23, 2025

టెన్త్‌లో RECORD: 600కు 600 మార్కులు

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల చరిత్రలో అరుదైన రికార్డు నమోదైంది. కాకినాడలోని భాష్యం స్కూల్ విద్యార్థిని యల్ల నేహాంజని 600కు 600 మార్కులు సాధించింది. పదో తరగతిలో 600 మార్కులు సాధించడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. దీంతో నేహాంజనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
*Congratulations Nehanjani Yalla

News April 23, 2025

టెస్లాకే టైం కేటాయిస్తా: మస్క్

image

మే నెల నుంచి టెస్లా వ్యవహారాలకే అధిక సమయం కేటాయిస్తానని మస్క్ ప్రకటించారు. DOGE కోసం ఎక్కువ సమయం పనిచేయనని తెలిపారు. టెస్లా త్రైమాసిక లాభాలు 71శాతం మేర క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. DOGEకు అధినేతగా వ్యహరిస్తున్న మస్క్ నిర్ణయాలతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు తొలగించారు. దీంతో మస్క్‌పై వ్యతిరేకత అధికమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!