News January 3, 2025
‘కొత్త ఇసుకను రీచ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1735911330811_50299483-normal-WIFI.webp)
రాష్ట్రంలో కొత్త రీచ్లను ఎప్పటికపుడు గుర్తించి ఇసుకను ప్రజలకు అందుబాటులోకి ఉండేలా చర్యలు తీసుకోవాలని గనుల శాఖ ప్రిన్సిపల్ ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఇసుక సరఫరా అంశంపై గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కర్నూల్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పీ.రంజిత్ బాషా హాజరై మాట్లాడారు.
Similar News
News January 17, 2025
కర్నూలుకు పెట్టుబడుల క్యూ.. కారణమిదే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737087403701_727-normal-WIFI.webp)
☞ ఓర్వకల్లు విమానాశ్రయం ఉండటం
☞ ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో అందుబాటులో భూమి
☞ హైదరాబాద్- బెంగళూరు నగరాలకు మెరుగైన రవాణా సౌకర్యం
☞ సీమ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం
☞ నీటి వనరుల అనుకూలం
☞ సంస్థలకు త్వరితగతిన అనుమతులు
☞ ఓర్వకల్లు విమానాశ్రయంలోని రన్వేను డ్రోన్ల పరిశీలనకు వినియోగించుకునే అవకాశం
☞ కర్నూలు ఎమ్మెల్యే పరిశ్రమల శాఖ <<15167493>>మంత్రిగా<<>> ఉండటం
News January 17, 2025
ఆదోనిలో పత్తి క్వింటా రూ.7,632
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737080786798_727-normal-WIFI.webp)
ఆదోని మార్కెట్లో చాలా రోజుల తర్వాత పత్తికి గిట్టుబాటు ధర లభిస్తోంది. మార్కెట్ యార్డులో నిన్న క్వింటా రూ.7,632 పలికింది. పత్తి కోతలు మొదలైనప్పటి నుంచి ఇదే అత్యధిక ధర. నిన్న 1,785 క్వింటాళ్ల సరకు మార్కెట్కు రాగా గరిష్ఠ ధర రూ.7,632, సరాసరి రూ.7,389, కనిష్ఠ ధర రూ.5,580తో అమ్మకాలు జరిగాయి.
News January 17, 2025
గోనెగండ్లలో విషాదం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737077024765_51181747-normal-WIFI.webp)
కర్నూలు జిల్లా గోనెగండ్లలో మందు బాబులు ఓ వ్యక్తి ప్రాణం తీశారు. పూటుగా తాగి బైక్పై వెళ్తూ స్టేట్ బ్యాంక్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఆటో డ్రైవర్ రమేశ్ను ఢీకొన్నారు. తలకు తీవ్ర గాయం కావడంతో బంధువులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న రమేశ్ కోలుకోలేక శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. మృతుడికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటన ఆ ఇంట విషాదం నింపింది.