News April 16, 2025
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: అ.కలెక్టర్

మునగాల మండల బరాఖత్ గూడెం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో తేమ శాతాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు.
Similar News
News October 15, 2025
హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన ఎస్పీ

జిల్లా పర్యటనలో భాగంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే సురేష్ రెడ్డి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల న్యాయమూర్తి సుబ్బారెడ్డి బుధవారం ఏలూరులో పర్యటించారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు న్యాయమూర్తులకు ఏలూరు అతిథి గృహం వద్ద ఘన స్వాగతం పలికి పూలగుత్తి అందించారు. పోలీసు సిబ్బంది వారికి గౌరవ వందనం సమర్పించి స్వాగతం పలికారు.
News October 15, 2025
దుబాయ్లో సిరిసిల్ల యువకుడి మృతి

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేటకి చెందిన యువకుడు దుబాయిలో అనుమానాస్పదంగా మృతిచెందాడు. గ్రామస్థుల ప్రకారం.. యువకుడు బిట్ల తేజ(24) బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. నెలరోజుల క్రితం స్వగ్రామానికి వస్తున్న క్రమంలో తేజ దుబాయ్లో షాపింగ్ కోసం బయటకు వెళ్లాడు. తిరిగి రూంకు రాకపోవడంతో స్నేహితులు కుటుంబీకులకు అనుమానాస్పందంగా మృతి చెందినట్లు తెలిపారు. బుధవారం అతడి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది.
News October 15, 2025
విజయవాడలో స్టెరాయిడ్స్ కలకలం

విజయవాడలో బుధవారం స్టెరాయిడ్స్ కలకలం రేగింది. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫిట్నెస్ సెంటర్లో జిమ్ ట్రైనర్ వద్ద స్టెరాయిడ్స్ను సుమారు 10 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.