News July 23, 2024
కొప్పర్తికి నిధులు ఇస్తాం: నిర్మలా సీతారామన్

ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. విశాఖ-చెన్నై కారిడార్లో కొప్పర్తికి నిధులు కేటాయించినట్లు తెలిపారు. నీళ్లు, రోడ్లు, హైవేల అభివృద్ధికై నిధులు కేటాయిస్తున్నట్లు నిర్మలా తెలిపారు.
Similar News
News November 15, 2025
పంటల రక్షణకు IOT సాంకేతికత అవసరం: కలెక్టర్

కడప కలెక్టరేట్లో మైక్రో ఇరిగేషన్, ఉద్యాన పంటల సస్యరక్షణపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ సమీక్ష నిర్వహించారు. వాతావరణ మార్పుల పర్యవేక్షణకు నూతన సాంకేతిక పరిజ్ఞానం మేళవింపు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. క్రాపిన్, ఫసల్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. ఐఓటీ ఆధారిత స్మార్ట్ వ్యవసాయ పరికరాల ప్రయోజనాలను తెలుసుకున్నారు. ఈ టెక్నాలజీ నీటి సమర్థతను, దిగుబడిని పెంచి, వ్యాధుల ముందస్తు హెచ్చరికలు ఇస్తుందన్నారు.
News November 14, 2025
పంటల రక్షణకు IOT సాంకేతికత అవసరం: కలెక్టర్

కడప కలెక్టరేట్లో మైక్రో ఇరిగేషన్, ఉద్యాన పంటల సస్యరక్షణపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ సమీక్ష నిర్వహించారు. వాతావరణ మార్పుల పర్యవేక్షణకు నూతన సాంకేతిక పరిజ్ఞానం మేళవింపు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. క్రాపిన్, ఫసల్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. ఐఓటీ ఆధారిత స్మార్ట్ వ్యవసాయ పరికరాల ప్రయోజనాలను తెలుసుకున్నారు. ఈ టెక్నాలజీ నీటి సమర్థతను, దిగుబడిని పెంచి, వ్యాధుల ముందస్తు హెచ్చరికలు ఇస్తుందన్నారు.
News November 14, 2025
ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్ GST రూ.15.25 లక్షలు మాయం..!

ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ GSTకి సంబంధించిన భారీ నగదు లెక్కల్లో కనిపించడం లేదు. ఈ విషయాన్ని జీఎస్టీ అధికారులు గురువారం గుర్తించారు. 2021లో ఎగ్జిబిషన్కు సంబంధించి జీఎస్టీ రూ.15.25 లక్షలుగా నిర్ధారించారు. ఈ సొమ్మును చెల్లించామని మున్సిపల్ అధికారులు చెప్పగా.. ఆ డబ్బులు తమకు జమ కాలేదని GST అధికారులు అంటున్నారు. అసలు గుట్టు తేల్చడానికి జీఎస్టీ అధికారులు ఆడిట్కు సిద్ధమయ్యారు.


