News April 15, 2025
కొమరాడ: రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన కొమరాడ మండలం అర్థం సోమినాయుడు వలస రైల్వే గేట్ల సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. జీఆర్పీ ఇన్ఛార్జి రత్నాకర్ తెలిపిన వివరాలు ప్రకారం.. రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొని కొప్పర వెంకటరమణ (26) మృతి చెందినట్లు తెలిపారు. సమీపంలో తన పొలం చూసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నాట్లు పేర్కొన్నారు.
Similar News
News November 23, 2025
ములుగు: నేడు సర్పంచ్ రిజర్వేషన్ జాబితా విడుదల..!

సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ రాత్రి వరకు జరిగింది. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో 10 మండలాల్లోని 146 గ్రామపంచాయతీలకు రిజర్వేషన్లను అధికారులు నిర్ణయించారు. అనంతరం నివేదికను కలెక్టర్కు అందజేశారు. నేడు తుది జాబితాను కలెక్టర్ అధికారికంగా విడుదల చేయనున్నారు. అనంతరం ఇదే జాబితాను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
News November 23, 2025
GVMCలో అవినీతి ‘ప్లానింగ్’..!(1/1)

నిర్మాణ రంగం ఊపందుకుంటున్న విశాఖలోని GVMC <<18365028>>టౌన్ ప్లానింగ్<<>> విభాగంపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలోని అన్ని జోన్లలో దాదాపు పరిస్థితి ఒకేలా ఉంది. అనుమతులు, కంపౌండ్ వాళ్లు, ప్లాన్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు.. ఏ పనైనా “ధనం ఉంటే వెంటనే-లేకపోతే నెలల తరబడి లేటు” అన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా, నిబంధనలు పట్టించుకోకుండానే కొన్ని భవనాలకు అనుమతులు ఇస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
News November 23, 2025
GVMCలో అవినీతి ‘ప్లానింగ్’..!(1/2)

త్వరలో 10జోన్లుగా రూపాంతరం చెందనున్న GVMCలో(ప్రస్తుతం 8) భవన నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు ఆన్లైన్లో <<18364917>>అనుమతులు<<>> ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అనుమతున్నీ ఉన్నా అదనంగా కొర్రీలు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. ఒక భవనానికి అనుమతి కావాలంటే రూ.లక్షల్లో ముడుపులు అడుగుతున్నట్లు నిర్మాణదారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు నిఘా పెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.


