News April 15, 2025

కొమరాడ: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన కొమరాడ మండలం అర్థం సోమినాయుడు వలస రైల్వే గేట్ల సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. జీఆర్పీ ఇన్‌ఛార్జి రత్నాకర్ తెలిపిన వివరాలు ప్రకారం.. రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొని కొప్పర వెంకటరమణ (26) మృతి చెందినట్లు తెలిపారు. సమీపంలో తన పొలం చూసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నాట్లు పేర్కొన్నారు.

Similar News

News December 5, 2025

కృష్ణా: 48 వేల అపార్ ఐడిలు పెండింగ్.!

image

విద్యార్థుల వివరాలు, సర్టిఫికెట్ల డిజిటలైజేషన్ కోసం తప్పనిసరి చేసిన 12 అంకెల ‘అపార్ ఐడీ’ నమోదు ప్రక్రియలో ఆధార్, పుట్టిన తేదీ లోపాల కారణంగా NTR జిల్లాలో 37 వేలు, కృష్ణా జిల్లాలో 11 వేల మందికి పైగా వివరాలు నమోదు కాలేదు. దీంతో, తప్పులు సరిదిద్దే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లు ఆర్డీఓలు, ఎంఆర్‌ఓలకు ఆదేశాలు జారీ చేశారు. అపార్ ఐడీతో దొంగ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు.

News December 5, 2025

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో 19 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీటిలో హెడ్ SeMT, సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి BE/B.Tech/BCA/BSc(IT)/BSc(CS), M.Tech/MS/MBA/MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://ora.digitalindiacorporation.in

News December 5, 2025

పైడమ్మ జాతర రెండో రోజు.. సిద్ధమవుతున్న శిడిబండ్లు.!

image

పెడనలో పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు శుక్రవారం శిడిబండ్ల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జాతర రెండో రోజు కాపుల వీధి నుంచి విశేషంగా మొత్తం 11 శిడిబండ్లు అంగరంగ వైభవంగా అమ్మవారి సన్నిధికి బయలుదేరనున్నాయి.