News April 15, 2025

కొమరాడ: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన కొమరాడ మండలం అర్థం సోమినాయుడు వలస రైల్వే గేట్ల సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. జీఆర్పీ ఇన్‌ఛార్జి రత్నాకర్ తెలిపిన వివరాలు ప్రకారం.. రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొని కొప్పర వెంకటరమణ (26) మృతి చెందినట్లు తెలిపారు. సమీపంలో తన పొలం చూసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నాట్లు పేర్కొన్నారు.

Similar News

News October 26, 2025

వాయుగుండం.. భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు తీవ్ర వాయుగుండంగా, రేపటికి తుఫానుగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది. రేపు అర్ధరాత్రి లేదా ఎల్లుండి తీవ్ర తుఫానుగా మారనుందని అంచనా వేసింది. ఈ నెల 28న సాయంత్రం తీరం దాటే ఆవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు, రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురుస్తాయని తెలిపింది.

News October 26, 2025

SDPT: తగ్గిన మద్యం కిక్కు.. ఎవరికి దక్కేనో లక్కు ?

image

సిద్దిపేట జిల్లాలో ఈసారి మద్యం దుకాణాలకు దరఖాస్తులు వేయడానికి అంతగా ఆసక్తి చూపలేదు. గతంతోపోలిస్తే సగం దరఖాస్తుల తగ్గాయి. ఈనెల 18 వరకు దరఖాస్తుల స్వీకరణకు ఉన్న గడుపును 23 వరకు పొడిగించినా 93 వైన్ షాపులకు 2,782 దరఖాస్తులే వచ్చాయి. 2023లో 4,166 రాగా ఈసారి 1,384 దరఖాస్తులు తగ్గాయి. టెండర్ దరఖాస్తు ధర రూ.3 లక్షలకు పెరగడంతో వేయడానికి వెనకాడారు. కాగా 27న డ్రా తీయనుండగా లక్కు కోసం ఎదురుచూస్తున్నారు.

News October 26, 2025

పండుగ రోజున ఉల్లిపాయ ఎందుకు తినకూడదు?

image

ఉల్లిపాయలో ఉండే తామసిక గుణం వల్ల మన శరీరంలో వేడి, ఉత్తేజం పెరుగుతుంది. పండుగ రోజుల్లో మన మనస్సు ప్రశాంతంగా, స్థిరంగా, భగవత్ చింతనలో ఉండాలంటే.. శరీరంలో ఈ గుణం ఉండకూడదు. అందుకే పర్వదినాన ఉల్లిపాయ వద్దంటారు. ఉల్లిపాయను తింటే అది మన ఏకాగ్రతను భంగపరచి, మనస్సును లౌకిక విషయాల వైపు మళ్లిస్తుంది. ఉల్లిపాయను తినకుండా ఉంటే మనస్సు నిర్మలంగా ఉండి, భగవంతునికి మరింత దగ్గరవుతామని నమ్మకం. <<-se>>#DHARMASANDEHALU<<>>