News April 15, 2025

కొమరాడ: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన కొమరాడ మండలం అర్థం సోమినాయుడు వలస రైల్వే గేట్ల సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. జీఆర్పీ ఇన్‌ఛార్జి రత్నాకర్ తెలిపిన వివరాలు ప్రకారం.. రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొని కొప్పర వెంకటరమణ (26) మృతి చెందినట్లు తెలిపారు. సమీపంలో తన పొలం చూసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నాట్లు పేర్కొన్నారు.

Similar News

News November 22, 2025

ఏపీలోనూ సర్పంచ్ ఎన్నికలు.. సన్నాహాలు షురూ!

image

TGలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు జరుగుతుండగా APలోనూ సన్నాహాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల జాబితాను SEC సేకరించినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారుచేయగానే నోటిఫికేషన్ విడుదలచేసే ఛాన్స్ ఉంది. కాగా APలో 2021 FEB, APRలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి.

News November 22, 2025

NGKL: తుఫాన్ ఎఫెక్ట్ తగ్గిన చలి తీవ్రత

image

ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ వల్ల వర్షాలు కురుస్తుండటంతో నాగర్‌కర్నూల్ జిల్లాలో చలి తీవ్రత తగ్గింది. గడచిన 24 గంటలలో జిల్లా వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు శనివారం ప్రకటించారు. కల్వకుర్తిలో కనిష్ట ఉష్ణోగ్రతలు 18.4 డిగ్రీలు నమోదయింది. చారకొండ, అమ్రాబాద్‌లో 18.9, వెల్దండలో 19.2, తాడూరులో 19.3, తెలకపల్లిలో 19.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.

News November 22, 2025

NGKL: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధత..!

image

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లా అధికారులు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ప్రకటించిన రిజర్వేషన్లు పక్కనపెట్టి కొత్తగా గ్రామాల వారిగా రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 26 లేదంటే 27న ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది..? నాగర్ కర్నూల్ జిల్లాలో 460 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.