News October 22, 2024

కొమరాడ: విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

image

కొమరాడ మండలం కూనేరు గ్రామంలో ఓ బాలుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. స్థానికంగా ఉన్న చర్చికి ఎలుకలు వచ్చి వస్తువులను పాడు చేస్తున్నాయని కడ్రక కృష్ణ అనే వ్యక్తి చర్చి చుట్టూ విద్యుత్ (కంచెను) ఎర్త్ పెట్టాడు. ఆ విషయం తెలియని బాలుడు జిన్నాన అనేష్ (4) ఆడుకుంటూ వెళ్లి ఆ వైర్లను తాకడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలపడంతో కొమరాడ పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.

Similar News

News February 25, 2026

VZM: మార్చి 2న JNTU జీవీలో యూత్ పార్లమెంట్

image

విజయనగరం JNTU జీవీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మార్చి 2న యూత్ పార్లమెంట్ నిర్వహిస్తామని జిల్లా యువజన అధికారి ప్రేమ భరత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను వీసీ ప్రొఫెసర్ సుబ్బారావు బుధవారం ఆవిష్కరించారు. 18 నుంచి 25 ఏళ్లలోపు విజయనగరం జిల్లా యువతీ, యువకులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు అన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 28 లోగా పేర్లను మైభారత్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News February 25, 2026

సీఎం పర్యటనలో అలసత్వం వద్దు: హోంమంత్రి అనిత

image

పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమానికి CM చంద్రబాబు ఈనెల 28న రావివలస రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు రేపటి సాయంత్రానికల్లా పూర్తి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి, హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి VC ద్వారా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి, తదితరులతో సమీక్షించారు. పారిశుధ్యం, భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు పక్కాగా చేయాలని, విధుల్లో అలసత్వం వహించవద్దని సూచించారు.

News February 25, 2026

VZM: ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 952 మంది గైర్హాజరు

image

విజయనగరం జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షను 21,048 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 20,096 మంది హాజరయ్యారని రీజనల్ ఇన్‌స్పెక్టర్ తవిటినాయుడు తెలిపారు. మొత్తం 952 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 100 మంది ఇన్విజిలేటర్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు, 3 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను నియమించారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆయన చెప్పారు.