News August 5, 2024

కొమరోలు: మంచం పట్టిన చింతలపల్లి గ్రామం

image

కొమరోలు మండలం చింతలపల్లిలో ప్రజలు సీజనల్ వ్యాధుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటికి ఒకరు లేదా ఇద్దరు మంచం పట్టారు. సీజనల్ వ్యాధులు సోకుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కొంతమందికి ఇళ్ల వద్ద చికిత్స అందించారు. మరి కొంతమంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Similar News

News December 10, 2025

ప్రకాశం జిల్లాలో సబ్సిడీతో పెట్రోల్.!

image

ప్రకాశం జిల్లాలో మూడు చక్రాల మోటార్ వాహనాలు కలిగిన అర్హులైన దివ్యాంగులకు పెట్రోల్ సబ్సిడీతో మంజూరు చేయనున్నట్లు సంబంధిత శాఖ సహాయ సంచాలకులు సువార్త తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి పెట్రోల్ సబ్సిడీ మంజూరయిందన్నారు. పెట్రోల్ సబ్సిడీ పొందేందుకు ఆసక్తి గల దివ్యాంగ అభ్యర్థులు కార్యాలయంలో అందించే దరఖాస్తులను 17లోగా అందించాలని ఆమె తెలిపారు.

News December 10, 2025

ప్రకాశం వాసులకు CM గుడ్ న్యూస్.!

image

ప్రకాశం జిల్లాకు సంబంధించి CM కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ఉద్యానవన పంటలు సాగుచేసే రైతన్నలకు శుభవార్తగా చెప్పవచ్చు. ఉద్యానపంటలపై సమీక్షించిన సీఎం, జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులను పూర్తి చేయడం ద్వారా పంటలకు నీరు అందించవచ్చని అధికారులకు సూచించారు. పోలవరం -నల్లమల సాగర్ ప్రాజెక్టుల అనుసంధానంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కొత్తగా 7లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు.

News December 10, 2025

చీమకుర్తిలో పిల్లలతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

image

చీమకుర్తిలోని ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ రాజాబాబు, MLA విజయ్ కుమార్ బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. తదుపరి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓలు శివాజీ, ఎల్వీ నరసింహారావు, మండల టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.