News February 4, 2025

కొమురంభీమ్: కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రచారం

image

బెజ్జూర్ మండలంలోని గబ్బాయి గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు సురేశ్ గౌడ్ ఆధ్వర్యంలో MLC ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల MLC అభ్యర్థి ఆల్ఫోర్స్ డా.వి.నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.

Similar News

News September 16, 2025

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి భారీగా నీటి విడుదల

image

వర్షాల కారణంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి 5-6 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేసే అవకాశం ఉందని మంగళవారం రామగుండం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.రవీంద్ర చారీ తెలిపారు. కడెం, శ్రీరాం సాగర్ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీరు పెరిగిన నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు, పశువులు, గొర్రెల కాపరులు, చేపల వేటగాళ్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

News September 16, 2025

BREAKING: మధుయాష్కీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

image

TG: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఛాంబర్‌లో ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆయనకు సచివాలయంలోని డిస్పెన్సరీలో తక్షణ వైద్యం అందించారు. అనంతరం గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి తరలించారు. కాగా మధుయాష్కీకి ప్రమాదమేమీ లేదని, బీపీ పెరిగి కళ్లు తిరిగి కిందపడ్డారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

News September 16, 2025

‘జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలి’

image

జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని నూతన కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర్ రెడ్డిని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయనను మంత్రి ఏపీ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్థికంగా, అభివృద్ధిపరంగా వెనకబడి ఉన్న జిల్లాను రాష్ట్రంలోనే ఉత్తమ జిల్లాగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.