News February 4, 2025
కొమురంభీమ్: కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రచారం

బెజ్జూర్ మండలంలోని గబ్బాయి గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు సురేశ్ గౌడ్ ఆధ్వర్యంలో MLC ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల MLC అభ్యర్థి ఆల్ఫోర్స్ డా.వి.నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
Similar News
News February 24, 2026
మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణ!

తెలంగాణ మావోయిస్ట్ క్యాడర్ DGP శివధర్ రెడ్డి సమక్షంలో రేపు లొంగిపోనున్నట్లు సమాచారం. కీలక నేతలు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లారాజిరెడ్డి, చొక్కారావు అలియాస్ దామోదర్, నున్నె నరసింహారెడ్డి అస్త్ర సన్యాసం చేయనున్నట్లు సమాచారం. వీరితో పాటు మరో 15 మంది లొంగిపోనున్నారట. దీంతో TG మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మారుతుందని పోలీసులు చెబుతున్నారు. రేపు దీనిపై DGP అధికారిక ప్రకటన చేస్తారని అంటున్నారు.
News February 24, 2026
ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొని ఇద్దరు యువకుల మృతి

సిద్దిపేట-కరీంనగర్ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రోబో రెస్టారెంట్ సమీపంలో బైక్ నియంత్రణ తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బొమ్మల పృథ్వి అక్కడికక్కడే మృతి చెందగా, చికిత్స పొందుతూ గుజారి నవీన్ మరణించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 24, 2026
ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొని ఇద్దరు యువకుల మృతి

సిద్దిపేట-కరీంనగర్ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రోబో రెస్టారెంట్ సమీపంలో బైక్ నియంత్రణ తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బొమ్మల పృథ్వి అక్కడికక్కడే మృతి చెందగా, చికిత్స పొందుతూ గుజారి నవీన్ మరణించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


