News March 25, 2025
కొమురవెల్లి: పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించిన సీపీ

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పది ఆదివారాల పాటు బందోబస్తు నిర్వహించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని సోమవారం పోలీస్ కమిషనర్ అనురాధ అభినందించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. జిల్లాలో జరిగే అతి పెద్ద జాతర మల్లన్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించిన సిబ్బందిని అభినందించారు.
Similar News
News October 13, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

➧కల్తీ మద్యం వ్యవహారంపై జిల్లాలో పలు చోట్ల వైసీపీ నిరసన
➧ బాలీయాత్రపై సీఎం చంద్రబాబుకు వివరించాం: ఎమ్మెల్యే కూన
➧ కొత్తూరు: నీట మునిగిన పంటను పరిశీలించిన అధికారులు
➧వజ్రపుకొత్తూరు: విద్యాబుద్ధులు నేర్పిన బడిలోనే..టీచర్గా చేరింది
➧ ఎస్పీ గ్రీవెన్స్కు 50 వినతులు
➧శ్రీకాకుళం: 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
➧టెక్కలి: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళల గొడవ
News October 13, 2025
MBNR ఇంటర్ విద్యార్థి సూసైడ్

మహబూబ్ నగర్ మండలంలోని రామ్ రెడ్డి కూడా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి ప్రియాంక (16) బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియాంక స్వస్థలం గద్వాల జిల్లా మల్దకల్. తనకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదని తల్లిదండ్రులకు చెప్పగా.. సోమవారం వస్తామని చెప్పగా అంతలోనే ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు విలపించారు. చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
News October 13, 2025
సకాలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు- అదనపు కలెక్టర్

జిల్లాలో సకాలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కీమ్యా నాయక్ ఆదేశించారు. ప్రభుత్వం వరి ధాన్యం గ్రేడ్-ఎ రకానికి రూ.2,389, కామన్ రకానికి రూ.2,369 మద్దతు ధర కల్పిస్తోందని తెలిపారు. అదేవిధంగా సన్నరకం వరికి రూ.500 బోనస్ ఇస్తుందని చెప్పారు. సీఎంఆర్ ధాన్యాన్ని వేగంగా సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.