News January 31, 2025
కొమురవెల్లి మల్లన్న ఆదాయం @రూ.58,47,941

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు శుక్రవారం లెక్కించారు. స్వామి వారికి 15 రోజుల్లో రూ.58,47,941 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో రామాంజనేయులు తెలిపారు. 31 గ్రాముల మిశ్రమ బంగారం, 6 కిలోల మిశ్రమ వెండి, 24 విదేశీ నోట్లు, మిశ్రమ బియ్యం 11 క్వింటాళ్లు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సిబ్బంది, టీజీబీ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 9, 2025
అనకాపల్లి: ‘పది, ఇంటర్ పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలి’

జిల్లాలో ఈ ఏడాది పది, ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు కృషి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. అనకాపల్లి కలెక్టరేట్ నుంచి మంగళవారం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శత శాతం ఉత్తీర్ణత సాధించేందుకు 100 రోజుల కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఇంటికి వెళ్లిన వసతి గృహాలకు చెందిన విద్యార్థులను వెంటనే వెనక్కి తీసుకురావాలన్నారు.
News December 9, 2025
ADB: ప్రచారం ముగిసింది.. పోలింగ్ మిగిలింది

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి సెక్షన్ 163 BNSS అమలులోకి వస్తుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమని పేర్కొన్నారు. ఇప్పటి నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఆ ప్రాంతాలలో అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలన్నారు. పోలింగ్ డిసెంబర్ 11 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని, అదే రోజు ఫలితాలు వస్తాయన్నారు.
News December 9, 2025
జిల్లాలో యూరియా కొరత లేదు: ప.గో కలెక్టర్

ప.గో జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. పంటకు, యూరియాకు సంబంధించి జిల్లాస్థాయిలో 83310 56742 నంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. రైతులు యూరియాకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేస్తే తక్షణమే పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు.


