News January 31, 2025
కొమురవెల్లి మల్లన్న ఆదాయం @రూ.58,47,941

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు శుక్రవారం లెక్కించారు. స్వామి వారికి 15 రోజుల్లో రూ.58,47,941 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో రామాంజనేయులు తెలిపారు. 31 గ్రాముల మిశ్రమ బంగారం, 6 కిలోల మిశ్రమ వెండి, 24 విదేశీ నోట్లు, మిశ్రమ బియ్యం 11 క్వింటాళ్లు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సిబ్బంది, టీజీబీ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 6, 2025
సిరిసిల్ల: రేపు మినీ జాబ్ మేళా

సిరిసిల్లలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఈనెల 7న ఉ.11 గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి నీల రాఘవేందర్ తెలిపారు. ఈ మేరకు సిరిసిల్లలోని కలెక్టరేట్లో గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన యువతీయువకులు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని ఆయన సూచించారు. SHARE IT
News November 6, 2025
మాక్ అసెంబ్లీకి కృష్ణా జిల్లా నుంచి ఏడుగురు విద్యార్థుల ఎంపిక

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ‘మాక్ అసెంబ్లీ’ కార్యక్రమం కోసం కృష్ణా జిల్లా నుంచి మొత్తం 7 నియోజకవర్గాల ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) తెలిపారు. ఈ మాక్ అసెంబ్లీ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సభా వ్యవహారాలు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని DEO వివరించారు.
News November 6, 2025
ఆగిరిపల్లిలో ఈనెల 11న జాబ్ మేళా

ఆగిరిపల్లి జెడ్పీహెచ్ హైస్కూల్ ఆవరణలో ఈనెల 11 మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జితేంద్రబాబు గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 17 కంపెనీలలో ఖాళీగా ఉన్న 1,135 ఉద్యోగ ఖాళీలకు జాబ్ మేళా జరుగుతుందన్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ. డిగ్రీ, బి.ఫార్మసీ, బిటెక్ తదితర విద్యా అర్హతలతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాజరు కావాలన్నారు. 18-35 ఏళ్ల వారు అర్హులన్నారు.


