News April 15, 2025
కొమురవెల్లి మల్లన్న హుండీ ఆదాయం ఎంతంటే..?

SDPT: కొమురవెల్లి మల్లికార్జున స్వామి వార్షిక ఆదాయం ఆలయ ఈవో అన్నపూర్ణ ఒక ప్రకటనలో వెల్లడించారు. 2024-25 సంవత్సర నికర ఆదాయం రూ. 20,97,93,956 వచ్చిందన్నారు. గత సంవత్సరం నికర ఆదాయం కంటే రూ. 2,23,29,490 అధికంగా సమకూరిందన్నారు. వార్షిక ఆదాయం రూ.45,81,77,096 కోట్లు వచ్చిందన్నారు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో బుద్ధి శ్రీని వాస్, పాల్గొన్నారు.
Similar News
News January 6, 2026
మెదక్ జిల్లా పరిధిలో చైనా మాంజా పూర్తిగా నిషేధం: ఎస్పీ

మెదక్ జిల్లా పరిధిలో చైనా మాంజాను పూర్తిగా నిషేధించినట్లు జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాస రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉల్లంఘిస్తూ చైనా మాంజాను విక్రయించినా, వినియోగించినా లేదా దాని వల్ల ఎవరికైనా ప్రమాదం సంభవించినట్లయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా దృష్టి పెట్టామన్నారు.
News January 6, 2026
మెదక్: గుప్త నిధుల పేరుతో మోసం.. ముగ్గురు అరెస్ట్

గుప్త నిధులు తీస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై బాలరాజు తెలిపిన వివరాలిలా.. కాట్రియాలలో గుప్త నిధుల పేరుతో మోసానికి పాల్పడిన సిరిసిల్లకు చెందిన కందకంచి రాజారాం, కందకంచి రాజేష్, అశోక్లను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
News January 5, 2026
మెదక్: 1978-94 వరకు చదివిన విద్యార్థులు ఒకే చోట

మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 1978 నుంచి 1994 వరకు విద్యాభ్యాసం చేసిన 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థినుల సమ్మేళనం ఆదివారం పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 350 మంది పూర్వ విద్యార్థినులు పాల్గొన్నారు. సఖీ సంఘ్ పేరిట నిర్వహించిన పూర్వ విద్యార్థినుల సమ్మేళానాన్ని డి.మధుర స్మిత్, డాక్టర్ చల్లా గీత, సీహెచ్.శ్రీదేవీ, రిటైర్డ్ హెడ్ మాస్టర్ పొద్దార్ రేఖ పర్యవేక్షించారు.


